Monday, May 16, 2011

Nedunuri - Karunajoodu Nanu Kamalapati

Shravanam with Kalyani

Nedunuri and Malladi Brothers sing a rare Tyagaraja song


Let us enjoy some great music!!
@@@@@@

Shravanam - Ravindra Sangeet

Shravanam with Tagore

150 years to Robindranath Tagore!!
Balantrapu Rajanikanta Rao garu presents a feature on and of Tagore's songs!!

Rajani presents Ravindra Sangeet in Telugu


Let us enjoy some great songs!!
!!!!!!!!

Wednesday, May 11, 2011

Says Kabira

Kabir makes you think!
He tells certain simple truths.
But, they punch you in the face!


They don't listen!

all keep trembling with empty fears.
None can think, don't know why?
They don't listen to my words a bit,
How then to go?
These eternal fears in these people--



Let us enjoy great words of Wisdom!
%%%%%

Tuesday, May 10, 2011

Sriman Puttaparti Narayanacharya - A review

ఆయనది పరిధిలేని పాండిత్యం

-గోపాలం కె.బి

April 23rd, 2011

పుట్టపర్తి నారాయణాచార్యులు
రచన: డా.పుట్టపర్తి నాగపద్మిని
సి.పి.బ్రౌన్ అకాడమీ,
53,
నాగార్జున హిల్స్,
పంజగుట్ట, హైదరాబాద్
పేజీలు: 216, వెల: రూ. 95/-
ఫోన్: 23423188, 23430448
పెళ్లాన్నేం చేస్తావురా బాళప్పా?’ ‘గొంతు పిసికి బాయిలో వేస్తాను!ఈ డైలాగును, బీచి అన్న పేరును శాన్నాళ్లుగా వింటున్నాము. కానీ ఇన్నాళ్లకు వాటి అసలు రూపం అర్ధమయింది. భీంసేనాచార్ (బీచి) కన్నడ నవలకు సరస్వతీ పుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల అనువాదంలోని మాటలవి. కథ చెప్పే వాళ్లకు ఊకొట్టే వాళ్లు కావాలి అన్న గొప్ప మాట కూడా ఆ నవలలోనిదే! ఎక్కడుంది ఆ నవల దొరుకుతుందా?
నారాయణాచార్యుల వాక్కు వణుకు లేనిదిఅన్నారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు. ఆ వ్యక్తిని గురించి, వాక్కును గురించి, బ్రౌన్ అకాడమీవారు సమగ్రమయిన పుస్తకం వ్రాయించారు. ఆ పుస్తకాన్ని ఆచార్యులవారి కుమార్తె నాగపద్మినిగారు రాయడం నిజంగా గొప్ప విషయం. నారాయణాచార్యులను గురించిన ఈ పుస్తకాన్ని నాగపద్మినిగారు ఒక కూతురుగా రాయలేదు. తండ్రిని ముందు గురువుగానే ఎంచి, అసలయిన అకడమిక్ సిద్ధాంత వ్యాసం పద్ధతిలో, శ్రమకోర్చి, వివరాలను సేకరించి, సోదాహరణంగా ఆమె చక్కని పుస్తకాన్ని అందించారు. మేరునగమంతటి మేటి పండితునికి, కూతురు పట్టిన ఈ నివాళి, సాహిత్యాభిమానులందరి నివాళిగా నిలిచింది.
నారాయణాచార్యులవారు సముద్రము వంటి వ్యక్తి. అందులోని లోతు అందరికీ అర్ధం కాదు. కానీ అందరికీ అందుతుంది. ఎన్నో భాషలలో పరిచయం, ప్రపంచం గురించిన అవగాహన కలిగి వారి కలానికి కలిగిన వైవిధ్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారంగా ఒక కవి, రచయిత పేరు చెప్పగానే ఒకటి రెండు రచనలు అందరికీ తెలిసి ఉంటాయి. పుట్టపర్తి వారి విషయంలో ఇది అంత సులభంగా జరగదు. పెనుగొండ లక్ష్మి నిజానికి అందరికీ తెలుసు. కానీ అది వారి రచనలలో ఒకటి మాత్రమే. అదొక్కటే ఆయనగారి రచనలలో గుర్తుండిపోయేది మాత్రం కాదు. శివతాండవమయినా అంతే!
ఆచార్యులవారు కవి, రచయిత, అనువాదకులు, విమర్శకులు, వ్యాఖ్యాత ఇంకా ఎనె్నన్నో. ఎన్ని భాషలు నేర్చారు? ఎన్ని పనులు చేశారు? ఆ వైవిధ్యం గురించి వారికి తెలుసు! అందుకే నా కవిత్వం బాగాలేదంటే కోపంరాదు. నేను పండితుణ్ణి కాదు అంటే మాత్రం కోపంవస్తుంది!అంటారాయన. రచనలను గురించి రాసినంత వివరంగా, వారి జీవితం గురించి కూడా మంచి పుస్తకం వస్తే బాగుంటుంది.
యువ ప్రాయంలో కాల్పనికత, తరువాత క్షేత్ర ప్రశస్తి, ఆ తరువాత ఆధ్యాత్మికం-రచనలు, వ్యాసంగం మామూలుగానే జరిగినట్టు కనపడుతుంది. పుస్తకంలో రకరకాల రచనలను వ్యాసాలుగా వివరించడం బాగుంది. ఆచార్యులవారి అభివ్యక్తి పద్ధతిలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ అంశం గురించి ప్రత్యేకంగా మరింత రాస్తే బాగుండును. దేవాంగనా వరిత దృక్పరిపూతమూర్తే’, ‘శిలలైన మనసులకు నే పాడలేనూ!’, ‘ఈ విరహ వీణలో ఎంతయానందమ్ముఅన్నీ ఒకే కలంనుంచి వచ్చిన మాటలేనా? అదే కలం వేల సంఖ్యలో భక్తిరచనలు చేసింది. అదేకలం మరొక చోట అవిగో మహాత్ముని నెత్తుటి చుక్కలు! ఏరుకోండి, ఏరుకోండి!అన్నది. పాండిత్యమంటే అది!
పుట్టపర్తి నారాయణాచార్యుల వారి గురించి పరిశోధన జరగలేదనడానికి లేదు. కానీ, జరగవలసింది మరెంతో ఉందన్న భావం ఈ పుస్తకం చదివిన తరువాత కలిగింది. తెలుగు జాతి రత్నాలు అన్న శీర్షికలో ఈ పుస్తకం రావడం ఎంత సమంజసంగా ఉంది. నాగపద్మినిగారు తదితరులు ఈ ప్రయత్నాన్ని ప్రారంభంగా భావించి, ఆచార్యుల వారి గురించి సాహితీ లోకానికి, సామాన్యులకు మరింత తెలియజేసే ప్రయత్నం చేస్తారని ఆశించడం ఆశకాదు! వారి గురించి వారి రచనల గురించి వచ్చిన ఈ పుస్తకం అందరిలోను ఈ ఆశను రేకెత్తిస్తుంది అంటే అనుమానమూ లేదు
చివరగా ఒక మాట! నారాయణాచార్యుల వారికి, ఏవో అవార్డులు రాలేదని ఒక అసంతృప్తి, కొందరిలో మిగిలి ఉంది. అందుకు కారణం ఆచార్యులవారే. వారేదో ఒక ప్రక్రియనుమాత్రమే పట్టుకుని అందులోనే సుడులు తిరిగి ఉంటే అందరూ గమనించేవారు. కానీ ఆయనది పరిధిలేని పాండిత్యం! ఆ గొప్పదనం, కొలబద్దకు అందలేదేమో? చాలా కొద్దిమంది మాత్రమే కొలతలకు లొంగకుండా ఎదిగిపోతారు. అరుదయిన ఆ తీరుగల వ్యక్తిత్వాన్ని స్థాలీపులాక న్యాయంగా, అద్దంలో కొండను చూపిన తీరుగా, ఈ పుస్తకం మనకు చూపిస్తుంది.

Let us enjoy some good books!
!!!!!

Monday, May 9, 2011

Sukumar Prasad - Guitar

Shravanam with Guitar

Sri Sukumar Prasad - Guitar




Let us enjoy good music!!
@@@@

Monday, May 2, 2011

Vikasam for Youth! - May 2nd

Here is the material from Vikasam page of Andhra Bhoomi.


ఛెక్కు బ్యాంకులో వేసి ఉండాలి! వెయ్యలేదు! అంటే బద్ధకమా? తీరిక దొరకలేదా? -ఏమిటి కారణం? ఫరవాలేదు, రేపు వేసినా కొంప మునగదు అన్న భావం దానికి కారణం. చేయవలసిన పనులను ముందుకు నెట్టడంలో రెండు రకాలున్నాయి. కొంతమంది చదువుకునే పిల్లలు, అన్ని పనులు చేస్తుంటారు... చదువుకోవడం తప్ప! పరీక్షలు వస్తున్నాయంటే మాత్రం పగలు, రాత్రి చదువుతారు. మంచి మార్కులు కూడా తెచ్చుకుంటారు. ప్రయాణ సమయానికి అరగంట ముందు మాత్రమే సామాను సర్దుకోవడం చాలామందికి అలవాటు. కరెంటు, టెలిఫోను మొదలు ఏ బిల్లయినా చివరి రోజున మాత్రమే కట్టడం చాలామందికి అలవాటు. ఇలాంటి వారందరు కూడా హాయిగానే బతుకుతుంటారు. పైగా మిగతా వారిని ఛాదస్తంగాళ్లని అనుకుంటారు కూడా!
ఈ రకం పద్ధతిని బద్ధకం అనలేము. అదొక పథకం. పదిహేను వందల మీటర్ల పరుగు పోటీలో ఎవరూ మొదటినుంచీ వేగంగా పరిగెత్తరు. అందరూ తాపీగా వెడుతూ, చివరి రౌండులోకి వచ్చిన తరువాత ఒక్కసారి వేగం పెంచి బులెట్‌లా దూసుకుపోతారు. అక్కడ బాగా పరిగెత్తాలంటే ఓపిక మిగిలి ఉండాలి. శక్తి ఉండాలి. అవి ఉంటే గెలుపు అందుతుంది. మరి ఈ పద్ధతి అన్నిచోట్లా మంచిదేనా? ఏమో?
మరి కొంతమంది పనిని పక్కనపెట్టి కూర్చుంటారు. చేయకుండా ఉంటే, కొంత కాలానికి చేయాల్సిన అవసరం ఉండదేమో చూద్దామన్నట్టు ఉంటుంది వారి ధోరణి. చెక్కు ఇవాళ బ్యాంకులో వేయకపోతే మురిగిపోతుంది. అయినా ఆ పని చేయకుంటే, బద్ధకం, నిర్లక్ష్యం, మరెన్నో కారణాలు. చాలామంది పనులు చేయకుండా ఉండడానికి, రకరకాల కారణాలు ఉంటాయని మనస్తత్వ వేత్తలు అంటున్నారు.
ఆ పని ఎలా చేయాలో తెలియదు. ఎవరినైనా అడగాలంటే నామోషీ!
తప్పుచేసి తిట్లు తినడంకన్నా, చేయకుండా తిట్లు తినడం బాగుందన్న భావం
చేయాల్సిన పని నచ్చక పోవడం. ఇష్టంలేని పని ఇచ్చారన్న కసి!
చివరిదాకా వేచి ఉండి, అప్పుడు బాగా చేసి మెప్పు పొందాలన్న కోరిక
నిజంగా బిజీగా ఉండి, సరైన సమయం ఏర్పాటుచేసుకోలేకపోవడం
స్వంత సమస్యలు
పని సరిగా జరుగుతుందో, జరిగిందో లేదోనన్న ఛానస్తం. ఇలా ఎన్నో కారణాలు! ఫలితంగా ఆదుర్దా, దోషభావం, నిద్రపట్టక పోవడం! ప్రతి పనినీ వాయిదా వేయకుండా ఉండడానికి కూడా పద్ధతులున్నాయి
పని పెద్దదిగా కనిపిస్తున్నదా? దాన్ని విడగొట్టి ముక్కలు చేసి చూడండి. ఆ ముక్కలను ఒక్కొక్కటిగా ముగిస్తూ వస్తే బోలెడంత బలం కలుగుతుంది.
ఏ పని ముందు చేయాలి? ఏది తర్వాత చేయవచ్చునన్న నిర్ణయాలు జరగాలి. చెక్కు బ్యాంకులో రేపు కూడా వేయవచ్చు. అంతేగాని చివరి రోజు దాకా ఆగకూడదు. మిగతా పని ఒత్తిడి ముఖ్యమైతే మరో రెండు రోజులు వాయిదా వేయవచ్చు. కానీ అదీ జరగవలసిన పనే!
పని ఉండగా అర్ధంలేని వేరే పనుల మీదకి ధ్యాసపోకుంటే మేలు. బొమ్మల పుస్తకం ఎన్నడయినా చూడవచ్చు. కిటికీలోంచి చూస్తూ ఎన్నడైనా కాలం గడపవచ్చు. సీట్లో హాయిగా కునుకు పడుతున్నదా? అనుకూలంగా లేని కుర్చీ తెచ్చుకోవాలి. పని జరగాలి!
ఇల్లంతా వస్తువులే. టేబుల్ నిండా వస్తువులే! వాటిలో వేటిని ఎప్పుడు వాడాలి. అవసరం లేని వాటిని ఏం చేయాలి. నిర్ణయించడం మంచిది. కొన్ని నిముషాల్లో ఆ పని ముగిస్తే తర్వాత చేయవలసిన పనులు సులభంగా తోచి వస్తాయి.
పనిమీద గురి కుదరక పోవడం, ఆ పని అప్పజెప్పిన వ్యక్తి ఇష్టం లేకపోవడం వల్లనా? ఎవరు అప్పజెప్పినా, మనం చేయాల్సిన పని మనమే గదా చేయాలి? చేసి పక్కన పడేస్తే మన మంచి పేరు నిలబడుతుంది. చేసింది ఎవరికోసమో కాదు మనకోసమే!
మనకన్నీ చేతవుతాయని మరీ పనిని తలకెత్తుకోవడం తప్పు. ప్రతి పనినీ అతిగా చూచి మరీ బాగా చేయాలనుకోవడం కూడా తప్పే! ఏపనికి ఎంత ప్రాముఖ్యం అవసరమో గుర్తించడం అవసరం. మన శక్తిని గుర్తించడం అంతకన్నా అవసరం.
చేయవలసిన పని, చేయవలసిన సమయంలో చేయకుంటే ఏమవుతుంది? ఆలోచన అవసరం. చివరకు మనమే ఆ పనిని ముగించాలేమో? మనకూ, మన వారికి నష్టం, కష్టం, అపకీర్తి వస్తాయేమో? ఆ పనేదో ముగిస్తే ఆలోచనలే ఉండవుగదా?
చాలా సందర్భాల్లో కష్టపడి పనిచేసినా ఎవరూ కనె్నత్తి చూడరుకూడా! చేయకుంటే మాత్రం కాకుల్లా పొడుస్తారు. అయినా మనం, మన పని ఎవరి మెప్పు కొరకో చేయనవసరం లేదు.
ఆలోచిస్తూ కూచుంటే ఏదీ జరగదు. పని మొదలుపెడితే అదే ముందుకు సాగుతుంది. కనీసం చేయడం కుదిరేట్లు లేదని అర్ధమయినా అవుతుంది.
గెట్ గోయింగ్! అది అసలు సూత్రం!

ఎందుకు నచ్చవ్.. బాసూ!?

బాసులు నచ్చకపోతే ఎవరూ సక్రమంగా పనిచేయరు. అసలు ఈ బాసులు ఉద్యోగులకు నచ్చకపోవడానికి కారణమేమిటని పరిశోధన జరిగింది. అందులో తెలిసిన సంగతులు మీరు గమనించండి.
నోటికి వచ్చినట్టు మాట్లాడడం.
తగిన వారున్నా, ప్రమోషన్లు ఇవ్వకుండా కొత్తవారిని పనిలోకి చేర్చుకోవడం.
వాగ్దానాలు చేయడమే కానీ, వాటిని నిజం చేయాలన్న శ్రద్ధ లేకపోవడం.
నిష్కారణంగా కొంతమంది మీద అభిమానం, కొంతమంది పట్ల అయిష్టత చూపడం.
తనవారుఅనే ఒక వర్గాన్ని తయారుచేసుకుని మిగతావారిని నిర్లక్ష్యం చేయడం.
ఉద్యోగుల వ్యక్తిగత ఆరోగ్యం, భద్రతల గురించి శ్రద్ధ చూపించకపోవడం.
అందరూ ఉండగా బాహాటంగా నిలదీసి తప్పులు లెక్కించి దుయ్యబట్టడం.
జీతాలు నిర్ణయించే విషయంలో పక్షపాత పద్ధతి.
రోజుకొకటిగా రూల్సు, నియమాలు, పద్ధతులు మారుస్తూ ఉండడం.
మంచి పని చేసిన వారిని గుర్తించడంలో జాప్యం, నిర్లక్ష్యం.
పని ముఖ్యం, నీ స్వంత సంగతులు ఏమైతే నాకెందుకూ అనే పద్ధతి.
క్రమశిక్షణ పేరున, అనవసరంగానే కొందరిని తప్పు పట్టడం.
ఎవరేం చెప్పినా చెవిని పెట్టకుండా ఉండడం.
తన పర్యవేక్షణలో జరగవలసిన పనిని గురించి తనకే పట్టులేకపోవడం.
అర్ధంలేని రూల్సుపెట్టి బాధించడం.
ఆఫీసు వాతావరణం, పరిశుభ్రత మొదలైన వాటిని పట్టించుకోకపోవడం.
అన్ని పనుల్లోను అనవసరంగా సాగదీసే ధోరణి.
ఇచ్చే సలహాలు, ఆదేశాలు అర్ధం కానివిగా ఉండడం.
ఇలా వేస్తూపోతే అధికారులు తమ సిబ్బందికి నచ్చకపోవడానికి ఎన్నో కారణాలుంటయి. మీ ఆఫీసురుగారు, ఒకరయినా వీటిలో ఎవో కొన్ని లక్షణాలు కలవారే ఉంటారు. అది తప్పదు. ఈ ప్రపంచంలో మనుషులంతా ఒక రకంగా ఉండరు గదా! ఇప్పటికే మీ చేతిలో అధికారం ఉంటే, రేపు వచ్చే వీలుంటే మరి మీరు ఈ విషయాలను గురించి ఏం చేస్తారు? ఆలోచించండి!

నీ పేరేమిటి?
ఒకప్పుడు ఒక మల్లయోధుడు ఉండేవాడు. అతని పేరు ఓనామీ. ఆ పేరుకు జపాను భాషలో పెద్ద అల లేదా మహా తరంగంఅని అర్ధం!
యోధుడు చాలా బలంగలవాడు. కుస్తీ గురించి బాగా తెలిసినవాడు. నేర్చుకునే చోట అతను స్వంత గురువునుకూడా చిత్తుగా ఓడించేవాడు. కానీ పదిమది ముందు మాత్రం సిగ్గుతో ముడుచుకుపోయేవాడు. కొత్త వారి చేతుల్లో కూడా ఓడిపోయేవాడు.
ఇందుకు మార్గంగా ఎవరైనా గురువుగారి సాయం పొందాలని అతను అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో హకుజు అనే గురువుగారు, దగ్గరలోని గుడిలో బస చేసి ఉన్నారని తెలిసింది. ఓనామీ వెళ్లి గురువుగారి ముందు గోడు చెప్పుకున్నాడు.
నీ పేరేమిటన్నావూ? మహాతరంగమని గదూ? ఇవాళ రాత్రి ఇక్కడే గుడిలోనే ఉండిపో! నిన్ను నీవు పెద్ద అలగా భావించు. సిగ్గుపడే మల్లయోధుడు ఇక లేడు. అల మాత్రమే మిగిలింది! అది అన్నింటినీ ముంచెత్తుతుంది. గతాన్ని మొత్తంగా మింగేస్తుంది. అట్లా చేస్తివంటే ఇక నీకు తిరుగుండదు అన్నారు గురువుగారు.
గురువు వెళ్లి పడుకున్నాడు. ఓనామీ మాత్రం ధ్యానానికి కూచున్నాడు. తనను తాను అలగా భావించసాగాడు. ఎనె్నన్నో ఆలోచనలు వచ్చాయి. చివరకు అలల బలం గట్టిపడసాగింది. రాత్రి గడిచిన కొద్దీ అలలు పెద్దవిగా వస్తున్నాయి. తోట మునిగిపోయింది. గుడి కూడా మునిగిపోయింది. కొంతకాలం తర్వాత అతని మెదడంతా సముద్రమయింది.
తెల్లవారింది. గురువుగారు నిద్రలేచారు. ఓనామీ మాత్రం ధ్యానంలో ఉన్నాడు. మహా తరంగమా? ఇక వెళ్లి నీ బలం చూపించు!అన్నారు గురువుగారు.
ఆనాడే మహాతరంగం ఒక పోటీలో గెలిచాడు. తరువాత అతనికి తిరుగులేదు.
ఆలోచనలను ఆపేస్తాయి!

అసలు మాట!
పిడికిలి బిగబట్టి ఉన్నప్పడు ఎవరూ సరిగా ఆలోచించలేరు!
-
జార్జ్ జా నతాన్
బిగువు, భయం, కోపం-ఇవన్నీ మెదడు తలుపులను మూసేస్తాయి.



Let us enjoy some good ideas!!
!!!!!!!!!!