Tuesday, November 30, 2010

Breaking the Barriers - AIDS

Today happens to be World AIDS day.
Incidentally few months back I happened to work on the communication strategy for AIDS sensitisation.
I did this on behalf of an NGO which is nowhere now!
Loves labour lost!!

I spent so much of my time in drafting the few pages that I did.
For whatever it is worth I share them here!

You tell me if it is worth transferring the material to people who care!


                                                                     An AIDS patient






Let us be of some help to the society!
&&&&

M S Gopalakrishnan - Mohanam

Shravanam with Mohanam!

Sri M S Gopalakrishnan - Nanupalimpa


Let us enjoy great Music!
@@@@

Thursday, November 25, 2010

Nandini Sidha Reddy - Poetry

Sidha Reddy is a friend right from the university days. We spent many an evening discussing poetry and short story etc.
Nandini stopped writing short stories for reasons beyond my understanding.
His poetry also has become rare.
Life sometimes takes it's toll on people.
But, he is still the same enthusiastic person even now.
People may remember his participation in the TV discussion on Telangana and literature.

Here is his latest poetry compilation.
He has matured into a poet with force.
He happens to be a protege of K Siva Reddy and openly accepts the same.


I also tried to translate couple of his poems as usual.
Here you go with one of them.

Wishes


If hail coming down
Is rain
I curse that rain
I dont care if you consider me an irritable character
I longed that paddy ears sing

If rolling in mud
Is life
I refuse that life
It is OK if you consider me mad
I wanted that the birds fly

If hanging the villages
Is development
I boycot that development
I dont mind if you get me announced as old fashioned
I wished that the tanks live

If serving their own people
Is ruling
I disobey that governance
It is OK if you consider me a revolutionary
I thought that the chimney of labour shine

If the arrogance of usurping
Is unity
I condemn that unity
It is alright if you stamp me as a seperatist
I am giving an offering asking for us what belongs to us.


Here is the second one with the original version too!

అరువు

ఆపద కొత్త కాదు
తన చెమటవలె
కష్టం కూడా కొత్త కాదు
కొత్తగా కాలం అమ్ముడువొయి
కష్టాన్ని అవమానించింది
పనిని పక్కు జరుపుతూ
ఒక మాటల శిల్పం ముందుకు వచ్చింది
లోకంలోని
ప్రాణశక్తులన్నీ తెల్లబొయినయి.

Loan

Danger is nothing new
Like own sweat
Toil is also nothing new
Newly time got sold
And insulted the toil
Pushing the work aside
An art of talk came to the fore
In the world
All the forces of life were flabberghasted.

Let me hasten to add that these are by no means the representative poems.
There are better ones in the collections that he published.


Either on the path made by the carts or the side track
Feet should move
Farmers legacy
Even if there is no rain
Must look at the sky
Even with the knowledge that none would come
Must cry where you feel like
Either it is paper or love
Only in the place wher you lost it
Must search for
Having filled sweet thoughts
All the near and dear unnaturally
Withered
To make the winds feel
Must sing here itself

Let us enjoy some good works with the words!
#######




Wednesday, November 24, 2010

Vikasam 2

Today's "YUVA" supplement in Andhra Bhoomi carries the third edition of the column Vikasam.
Visit the page and read my articles.
http://www.andhrabhoomi.net/yuva/vikasam-953 
I would be grateful if you choose to send me some feedback.

This is the content from the last weeks edition!

విజయగోపాల్ vijayagopalk@gmail.com, November 16th, 2010

రిలాక్స్ ప్లీజ్...
 

ధేశ రాజధాని కొత్త ఢిల్లీలో ఆటో నడుపుతున్న ఒకతను ఏదో మాట్లాడుతూ ‘టెన్షన్!’ అన్నాడు. ‘ఆటో నడపడంలో కష్టం ఏమిటి’? ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళ్లడం, మామూలుగానే ‘ఎక్కువ’ డబ్బులు తీసుకోవడం అనుకుంటున్న నాకు, ఒక్క క్షణం ఆశ్చర్యమయింది. కానీ, ఆలోచించి చూస్తే ఆటో నడపడంలో ఉండే చిక్కులు, ఒక్కొక్కటే అర్థమయినాయి! ‘అవును గదా! టెన్షన్!’ అనుకున్నాను. ఢిల్లీలో ‘టెన్షన్’ అందరికీ ఒక ఊతపదంగా ఉంటుందంటే నమ్మండి.

ఈ భూప్రపంచంమీద, ఆకర్షణలు, ఒత్తిడులు, టెన్షన్‌లు (్భతికపరమయినవి) వాటి వాటి స్థితిలో ఉండకపోతే, మనమంతా గాల్లోకి ఎగిరిపోతాము. బెలూనులాగా పేలిపోతాము. అవే ఆకర్షణలు, ఒత్తిడులు, టెన్షన్‌లు మనసులోనూ ఉంటున్నాయి. వాటిని పెంచి పోషించి మనమంతా, నానా బాధలు పడుతున్నాము. ‘అతనా! తొందరడడమా? ఎప్పుడయినా చూచారా?’ అని నా గురించి మరెవరో అంటే, నాకు టెన్షన్ పట్టుకుంది ఒకసారి!
సమస్యలు లేకుంటే అది బతుకే గాదు. సీత, పీతల కష్టాలు తెలుసు గదా! సమస్యల గురించి కాదు ఆలోచించంవలసింది. ముందుగా సమాధానాల గురించి పట్టించుకోవాలి.


గాలిలో మేడలు కట్టవద్దు. పేకమేడలు అంతకన్నా వద్దు. సమస్య గురించీ, సమాధానం గురించీ, చాలా వాస్తవికంగా ఆలోచించగలగాలి. చాలాసార్లు సమస్య, సమాధానం మన చేతుల్లో లేవని తెలుస్తుంది. అలాగని చేతులెత్తేయడం పద్ధతి కాదు. మనవంతుగా, ఏం చేయగలుగుతామో అది చేయాలి. ఫలితాలు తప్పకుండా వస్తాయి.

‘మన టెన్షన్‌కు మనమే పూర్తిగా బాధ్యులము’ అన్న సంగతి ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి. అది అర్థమయింది గదా, అని, సమస్యను అమాంతంగా ఎత్తి మరెవరి నెత్తినో పెట్టడం వీలుగాదు. తీసి కింద పడేయడం కూడా వీలుగాదు. ఆ విషయంగా మనం చేసే మార్పులు, ప్రాక్టికల్‌గా చిన్నవిగా, ఒక క్రమంలో ఉండాలి!

అసలు ముందు సమస్య గురించి మనకు అర్థమయిందా? తర్వాత మనం చేయదలుచుకున్నది ఏమిటి? ఈ రెండు సంగతులను మనం బాగా గుర్తించాలి. వాటిని గట్టిగా గుర్తుంచుకుని కార్యరంగంలోకి దిగాలి!

క్షణాల్లో ఏదో జరగాలి, జరుగుతుంది అనుకోవడం తప్పు! అసలు నావల్ల ఏమీ అయ్యేట్లు లేదు అనుకుంటే, మనమిక ముందుకు ఒక అడుగుకూడా వేయలేము.

ప్రయాణం ఎంత దూరమయినా, ఒకడుగు ముందుకు వేస్తేగానీ, అది ప్రారంభం కాదు. మనమూ మనుషులమే. అందరూ పరుగుపెడుతూ వెళ్లిపోతున్నారనీ, మనం ఇక్కడే ఉండిపోతున్నామనీ అనిపించడం సహజం! ఎక్కడా నిలబడి, ఉండిపోనంతకాలం, మనమూ ఏదో సాధిస్తూనే ఉంటాం!

ఏమీ జరగడంలేదు అనిపించిందా? ఏదో జరిగే ఉంటుంది. చేయలేకపోయిన విషయాలకన్నా, సాధించగలిగిన సంగతులను గురించి ఆలోచించడం మంచిది. ఉత్సాహం పెంచుకుని, జరగవలసిన సంగతులను గురించి ఆలోచిద్దాం!

మనల్ని ఎవరూ మెచ్చుకోరు! ఫరవాలేదు! మనల్ని ముందు మనం గుర్తించి మెచ్చుకుంటే, మరొకరి మెప్పుకోలు, తప్పక వస్తుంది!
అంతవరకూ... ‘నో టెన్షన్!’ ప్లీజ్!
-----------------------------------------------
మార్పు అవసరమా?

నేను పరిపూర్ణ మానవుడను, అంటే నిండు మనిషిని! నాలో ఏ లోపమూ లేదు.. నేను పరిశుద్ధ వ్యక్తిని, ప్రశాంత వ్యక్తిని.. నాలో లొసుగులే లేవు.. నేనిట్లా ఉన్నంత కాలం నాలో ఏ మార్పు అవసరం లేదు.. కానీ, నన్ను మీరు, నా మనసు ఆధారంగా గుర్తించేట్లయితే, నేను నా మనసు ప్రకారం బతుకుతుంటే, నాలో మరింత పరిపూర్ణత రావాలని నాకే అనిపిస్తుంది. నేను మారాలి మరి!

మనలను మనం గుర్తించుకోగలిగితే మనలో మార్పు అవసరం తెలుస్తుంది. ‘మీరు మారాలి’ అంటూ అన్ని వేపులనుంచీ మనకు బోధనలు, సూచనలు అందుతున్నాయి ఈ మధ్యన. శిక్షణ తరగతులు, పుస్తకాలు, ప్రసంగాలు ఎన్నో మనలను మారమంటున్నాయి.
వీటన్నిటితో మార్పు రావచ్చు. కానీ ఆ మార్పు నిజం కాదు. తిరుగులేనిది కాదు. మనలో లేని అంశాలను, మనలోనికి పంపడానికి ప్రయత్నాలవి. అంటే మనలో మార్పు కాదు. అది మన గుర్తింపుకు మార్పు అనవచ్చు.
మార్పు లోపలినుంచి రావాలి. మనలను మనం గుర్తించగలిగి, ‘‘ఇక్కడ మరేదో అవసరం ఉంది’’ అన్న భావన మనకు కలగాలి.

అప్పుడు ఈ ‘బాగుపడడం’ అనే కార్యక్రమం అందుకు హంగులుగా, శిక్షణ, పుస్తకాలు, ప్రబోధాలు రంగంలోకి వస్తాయి. మార్పులో అది ఒక భాగం మాత్రమే. మనం మారడానికి సిద్ధం కావాలి. అది అసలయిన మార్పు!



నిజమైన చిత్రం
నువ్వు నిద్రలేచినా లేవకున్నా తెల్లవారడం మాత్రం ఖాయం
-జాన్ చియార్డీ


మనం లేకపోతే ఈ ప్రపంచం ఏమయిపోతుందో అనుకోవడం మనకు అలవాటయింది. మనం లేకున్నా ప్రపంచం కొనసాగుతూనే ఉంటుంది. అందుకే మనమున్నందుకు ఏదో ఒక తేడా చూపించాలి.

.
--------------------------------------
ఉచితంగా... ఓ సలహా!
మిమ్మల్ని ఎవరయినా సలహాలడిగారా? మీరు సలహాలిస్తుంటారా?
ఒక్కక్షణం ఆలోచించండి!
సలహా అడుగుతున్నవాళ్లు నిజానికి సలహా అడగరు. వాళ్ల నిర్ణయం వాళ్లు చేసుకునే ఉంటారు. వాళ్ల బాధాగాధను మీరు వింటే చాలు!

వాళ్లకు కావాల్సింది ఓదార్పు. మీరున్నారన్న భావం చాలు!

వారికి మీరొక సర్టిఫికేట్ ఇవ్వాలి. నీవనుకున్నది బాగుంది అంటే చాలు!వాళ్లు మీకు దగ్గరగా వచ్చిన భావం కోసం వస్తారు. మనసులోని భయాలు, బాధలు, మీ ముందు పరిస్తే మీరు భుజం చుట్టూ చేయివేసి వారిని దగ్గరగా తీసుకుంటే చాలు.

వాళ్ల మాట సరయిందని మీరు అనాలి! వాళ్లలో లోపాలున్నా, బలహీనత ఉన్నా, వాళ్ల మాటలను మీరు పట్టించుకుంటారన్న నమ్మకం చాలు!నిర్ణయాల బాధ్యత మీరు తీసుకోవాలి! ‘ఈ నిర్ణయం నాది కాదు!’ అని వారు తమ బరువును దించుకునేందుకు సాయం చేస్తే చాలు!

వాళ్లకు బాధ చెప్పుకోవడానికి మరెవరూ కనిపించి ఉండరు. మీరే వారికి చివరి ఆశ. మీ మాట అక్కడ కిటుకవుతుంది. మీరేమీ చెప్పనవసరం లేదు. వాళ్ల నిర్ణయం వాళ్లే చేసుకుంటారు. మీరు పక్కన ఉంటే చాలు!

చర్చకు వచ్చిన సత్యాలు, సమాచారాలను తరచి చూడాలి. ఒత్తిడితో ఉన్నవారు సాధారణంగా నిజాలను గుర్తించలేకపోతారు. ఆ పరిస్థితుల్లో మీరు అండగా ఉంటే చాలు!

ఎవరికో సమస్య ఉంటే, మీరు సలహాలిచ్చారు. మీకు సమస్య ఎదురయితే ఎవరు సలహా ఇస్తారు! ఇదొక చక్రం! గుర్తుంచుకోండి.
------------------------


వోస్... ఇంతేనా!

విన్‌స్టన్ వార్డ్ చాలా కష్టపడి ఒక నివేదిక రాసి కిస్సింజర్‌కు పంపించాడు.
‘దీన్ని మరింత మెరుగుపరచడం వీలుపడదా?’ అన్న ప్రశ్నతో నివేదిక తిరిగి వచ్చింది
వార్డ్ మరింత కృషిచేసి నివేదికను తిరగరాసి పంపాడు.

మళ్లీ అదే కామెంట్‌తో నివేదిక తిరిగి వచ్చింది

మరోసారి వార్డ్ నివేదికను తిరగరాశాడు

మూడవసారీ అదే కామెంట్

‘నో! ఇక నావల్లగాదు!’ అన్నాడు వార్డ్

‘అయితే ఈసారి నివేదికను నేను చదువుతా’ అన్నాడు కిస్సింజర్.

Let us enjoy good ideas!



&&&&&------------

Tuesday, November 23, 2010

Abburi Varada Rajeswra Rao - Padyam

I never studied Sri Abburi Varada Rajeswara Rao's works.
I must have been a fool to do so!
He was such a great master in everything that he did.
I am getting to know him now after reading the wonderful book produced in his memory.

I am not ashamed of telling that classical poetry attracts me a lot!
Here is how the master used a classical meter to tell something as modern as it can be!
No doubt Viswanatha was aslo impressed!


Let us enjoy the works of great people!
%%%%%%

Monday, November 22, 2010

Maharajapuram Santanam - Todi

Shravanam with a Todi

Sri Maharajapuram Santanam - Todi



Let us enjoy great music!
@@@@

Sunday, November 21, 2010

Mysore T Chowdaiah - Violin

There is some problem with the upload and playing files from 4shared!
So, an interruption in Shravanam is unavoidable!

Here is a link to a wonderful collection of items by Sri Mysore T Chowdaiah.


Mysore T. Chowdiah - (1895-1967) "It is a feature of a violinist's career to burst abruptly into view", Menuhin has said. This is very true of ace violinist, Shri T.Chowdiah. His studies were stopped in boyhood to enable him to concentrate on music, in which his mother imparted early lessons. His uncle then took him to learn music under the veteran musician, Sri Bidaram Krishnappa of Mysore. Their association lasted fro about 20 years, during which Chowdiah progressed from discipleship to accompanist. Sri Chowdiah was a very painstaking sishya and mastered on the violin, ragas, kritis, swaras, etc. When he made mistakes, his guru used to chastise him & all this rigorous training enabled Chowdiah to become a mature and full-fledged violinist.


In the second and third decades of this century, Chowdiah came to notice the lowering of Adhara Shruti by vocalists. Amplification was not known then. The accompanist was therefore at a disadvantage, as his violin sound did not carry well and far enough to the audience. This set Chowdiah's active mind working on a method of rectifying the handicap. With the aid of a craftsman, he was able to fashion a seven-stringed violin, the sounds from which were agreeable and voluminous. Mysore Asthana vidwan Seshanna is reported to have been greatly impressed by it. Handling such a complex stringed instrument, however, needed skill to tailor it to Carnatic music. Chowdiah showed the way, which was later followed by his disciples C.R.Mani, the late Sethuramaiah and others.

Chowdiah was a powerful and popular violinist for many decades. He was called upon to accompany veterans like Chembai Vaidyanatha Bhagavathar, Ariyakudi Ramanuja Iyengar, Alathur Brothers, G.N.B, Musiri Subramania Iyer, Semmangudi Srinivasa Iyer and Madurai Mani Iyer. Percussionists like Dakshinamoorthy, Palghat Mani Iyer, Palani Subramanya Pillai were fellow-accompanists to him in dozens of concerts. Sri Chowdiah became Mysore Asthana Vidwan in 1939. The Music Academy, Chennai conferred the title of 'Sangitha Kalanidhi' in 1957 on him. He was also known to give solo violin concerts along with Gururajappa, C.R.Mani, Mysore Doraiswamy Iyengar, etc. His wide ranging accomplishments included his own inspired compositions like kritis, thillanas, etc.

His honors and titles include Asthana Vidwan in Mysore Court in 1939 , 'Sangita Ratna' by the Maharaja of Mysore in 1940, Presidential Award in 1956. He was nominated to the Mysore Legislative Council in 1957-58 and was titled 'Sangita Kalanidhi' by the Music Academy, Chennai on January 1, on his birthday in 1958. The title of 'Gana Kala Sindhu' was conferred upon him as well as the title 'Sangita Ratnakara' by Sri Sankaracharya of Sringeri Math in 1960.

http://www.mediafire.com/?mtsass463w2cy

Let us enjoy great music!!
@@@@

Medha - 4

Here is the content from the Medha page of Andhra Bhoomi.
This is the fourth edition of Medha after I started contributing the content.

Here is the link to the current edition

http://www.andhrabhoomi.net/features/intelligent

Now the content from 8th November 2010 edition.

అరటి విత్తుల కోసం
హైదరాబాద్ ప్రాంతంలో అంతకుముందు దొరుకుతూ ఉంటే ‘ఛీటేవాలా’ అరటి పళ్లు, ఒకానొక వైరసు పుణ్యమా అని అదృశ్యమయి పోయినాయి. ఆ తర్వాత అందరూ మహారాష్ట్ర మీదబడి అక్కడి నుంచి ఒక ఆకుపచ్చ రకం అరటిని అరువు తెచ్చుకున్నారు. పదేళ్ల కాలంలో ఆ రకం కూడా అంతరించే చోటికి చేరుకుంది. అసలు ప్రపంచమంతటా అరటి పళ్లకు పోగాలము దాపురించింది అంటున్నారు.
మనకిప్పుడు ప్రపంచమంతటా అందుబాటులో ఉన్న అరటి రాకాలేవీ ప్రకృతి సిద్ధంగా దొరికినవి కావు అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇన్నాళ్లుగా, ఇనే్నళ్లుగా పట్టువదలని విక్రమార్కుని లాగా, బ్రీడర్లు నిరంతరం తమవంతు కృషి చేస్తూ ఉండబట్టి గానీ, అరటిపళ్లు అసలింతగా దొరికేవే కావేమో!
మనం ఆనందంగా తింటున్న ఈ అరటి పండు అది ఏ రకమయినా సరే ఒక సంకర జాతి. మూసా అకూమినేటా అన్న జాతిలో మంచి గుజ్జు ఉంటుంది. కానీ దీని రుచి, నోటబెట్టరాకుండా ఉంటుంది. మరో జాతి మూసా బల్బీసియానా. ఇది రుచిగా ఉంటుంది గానీ, నిండా గింజలుంటాయి. అవును అరటి పండులో గింజలంటే ఆశ్చర్యం అవసరం లేదు! ఈ రెండు రకాల చెట్లు పక్కపక్కనే పెరుగుతూ ఉంటే వాటి మధ్యన పరపరాగ సంపర్కం జరుగుతుంది. కొత్త పిలకలు పుడతాయి. పెరిగి పెద్దవయి రుచికరమయిన అరటి గెలలను ఇస్తాయి. కానీ ఈ అరటి నుంచి కొత్త రకాలు మాత్రం పుట్టవు. ఈ రుచికరమయిన, పసుపురంగుగల, వంపు తిరిగిన అరటి పండ్లను మానవులు పదివేల సంవత్సరాల క్రితమే గుర్తించారు. అంతేగాకుండా వాటి దుంపల ద్వారా వ్యప్తి చేయవచ్చునని కూడా అర్థం చేసుకున్నారు. వ్యాపించిన అరటి చెట్లేవీ పిలకలు వేయవు. ఆయినా వాటి సంఖ్య పెంచడానికి వీలు ఉంది. అలా పంటలు కొనసాగుతూ ఉండగా, ఉండగా, అనుకోకుండా జరిగిన జన్యుమార్పుల కారణంగా ఈ నాటి అరటి జాతులు పుట్టుకు వచ్చాయి. అరబ్బు వారు వీటిని ఆఫ్రికాకు అందించారు. స్పానిష్ దండయాత్ర దారులు అమెరికా ఖండానికి అందించారు.
ప్రస్తుతం ప్రపంచంలో లెక్కలేనన్ని రకాల అరటి చెట్లున్నాయి. ఈ రకాలను కల్పివార్స్ అంటారు. కావెండిష్ అనే రకం అరటి యూరపు, అమెరికాల్లో ఎక్కువగా కనబడుతుంది. ఈ జాతిని ఉష్ణమండల ప్రాంతాలలో కూడా పండించి ఎగుమతి చేస్తున్నారు. ఇక ఆఫ్రికా, మన దేశంతో సహా ఆసియాలలో ఎన్నో రకాల అరటి చెట్లు ఉన్నాయి. చూడటానికి, రుచిలో వీటి మధ్య ఎన్నో తేడాలున్నాయి. అయినా ఇవన్నీ ఒకప్పటి మూసా నుంచి వచ్చినవే. ఇవేవీ మనిషి ప్రమేయం లేకుండా, వాటంతట అవే పెరిగే రకాలు కావు. వీటి సంఖ్య పెరగాలంటే దుంపలు, వేళ్లను వాడవలసిందే.
ఈ రకంగా అరటి మొక్కలను అవసరమయిన సంఖ్యలో పెంచడం సులభంగాదు. అందుకే టిష్యూకల్చర్ పద్ధతిలో మొక్కలు పెంచడం మొదలయిన వెంటనే, వారందరి చూపు మొదట అరటి చెట్లమీద పడింది.
ఈలోగా మరొక విషయం. అరటి వ్యాప్తికి అడ్డుగా రాసాగింది అరటికి చీడపీడలు. రోగాల దాడి ఎక్కువ. ‘చీటేవాలా’ జాతికి ఒక వైరసు సోకింది. దాని కారణంగా సరిగ్గా గెలవేసే సమయానికి చెట్టు నిలువునా చీలిపోవడం మొదలయింది. ఆ రకం అంతమయిపోయింది. అరటి చెట్లలో రోగ నిరోధకత తక్కువగా ఉండి అవి వ్యాధులకు సులభంగా గురికావడానికి కారణం ఆ జాతులన్నీ ఒకే రకం నుంచి రావడమే. అన్నీ జన్యుపరంగా ఒకే రకంగా ఉండడంతో రోగాలు వాటిలో సులభంగా వ్యాప్తి చెందుతాయి. ‘చీటేవాలా’ లాంటి స్థానిక రకాలు కూడా ఈ రకంగానే నాశనమవుతున్నాయి. ఇది ప్రపంచమంతటా జరుగుతున్నది.
ఈ రకంగా చూస్తే కొన్నాళ్లకు ప్రపంచంలో అరటిపళ్లు ఉండవేమోనన్న భయం పరిశోధకుల్లో కనబడుతున్నది.
ఇరవయ్యవ శతాబ్దం మధ్య కాలం దాకా గ్రాస్ మిచెల్ అనే కల్పివార్ అరటి అభివృద్ధి చెందిన దేశాలలో బాగా పండింది. పండు త్వరగా పాడవదు గనుక ఎగుమతికి కూడా ఆ రకం అనువుగా ఉండేది. కానీ పనామా అనే రోగం కారణంగా ఈ రకం అంతమయింది. 1950 తర్వాత వియత్నాం వారి కావెండిష్ రకం మళ్లీ బలం పుంజుకున్నది. కానీ ఈ రకాన్ని పెంచడానికి, నిలువకూ, మగ్గపెట్టడానికీ వాడవలసిన పద్ధతులన్నీ కొత్త అయినా అంతకు ముందున్న ‘బిగ్‌మైక్’ రకం పోయింది. 1960 నుంచి కావెండిష్ రాజ్యం మొదలయింది. ఇది రుచిలో, అంతకు ముందు రకాలకు ఏరకంగానూ పోలదు అంటారు పాతరకాలను ఎరిగిన వారు. 1992 నుంచి ఈ రకానికి కూడా మళ్లీ ‘పనామా’ తాకిడి మొదలయింది. దీనమీద పురగు మందులేవీ పనిచేయడం లేదు. ఆసియాలో విస్తరిస్తున్న ఈ వ్యాధి ఇంకా లాటిన్ అమెరికాకు చేరలేదంటున్నారు. ‘అందుకు కాలం మాత్రమే అడ్డు’ అని కూడా వాళ్లే అంటున్నారు.
అరటి లేకుండా కాకూడదంటే ఆ రకంలో విత్తులు పుట్టించాలి. అందుకు అయ్యే శ్రమ అంతా ఇంతా కాదు. మనిషి పూనుకుని పరపరాగ సంపర్కం చేయించాలి. మూడు వందల పళ్లలో నుంచి ఒక దాంట్లో మాత్రమే విత్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విత్తుల్లో మూడవవంతులో మాత్రమే సరైన జన్యులక్షణాలుంటాయి.
టన్నులకొద్దీ పళ్లను గుజ్జు చేసి అందులో గింజలను వెదకడం ఎలాగుంటుందో ఊహించండి.
హోండూరాస్ లాంటి దేశాలలో ఈ పని జరుగుతూనే ఉంది. బజార్లో కొత్తరకం అరటిపళ్లు కనిపించినా, అసలే రకమూ కనిపించక పోయినా ఆశ్చర్యం అవసరం లేదేమో?


పురుగులను తింటే పోలే?

1885లోనే విన్సెంట్ హాల్ట్ అనే బ్రిటిష్ కీటక శాస్తజ్ఞ్రుడు ‘పురుగులను తింటే సరి!’ అని అర్థం వచ్చే పేరుతో ఒక పుస్తకం రాశాడు. మంచి ఆలోచనే. పైగా ప్రపంచంలో మన దేశంతో సహా చాలా దేశాలలో పురుగులను మహా ఇష్టంగా తింటారు. వానకాలంలో పుట్టుల దగ్గర దీపం పెట్టి, దానిమీద చిల్లుల కుండ బోర్లించి, అందులో దూరి రెక్కలు పోగొట్టుకున్న ఉసిళ్లను తినడం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఉష్ణమండల ప్రాంతాలలో పురుగులు పెద్దవిగా ఉంటాయి. అవి ఒకేచోట పెద్ద సంఖ్యలో దొరుకుతాయి. వాటిని పట్టడం సులభం. పడమటి దేశాల వారు మాత్రం ఇక్కడి వాళ్లు తిండికి గతిలేక పురుగులను తింటారని అనుకుంటారు. అది కేవలం అపోహ. పురుగులను తినేవారు వాటిని అరుదుగా దొరికే రుచి కోసం మాత్రమే తింటారు.
పురుగులు ఏ ఇతర మాంసానికీ తీసిపోవు. వాటిలో రకాలను బట్టి 30 నుంచి 70 శాతం దాకా ప్రొటీనులుంటాయి. ఎసెన్షియల్ ఫాటీ ఆసిడ్‌లు, బి విటిమన్ కూడా వాటిలో పుష్కలంగా ఉంటుంది. అయిరన్, జింక్ లాంటి ఖనిజాలు ఉంటాయి. పురుగుల శరీరం మీద కైటిన్ అనే ప్రొటీన్‌తో తయారయిన పెంకు ఉంటుంది. అది శరీరం బరువులో పదిశాతం కన్నా ఎక్కువ మాత్రం ఉండదు. ఆశ్చర్యమేమిటంటే ఈ పెంకును కూడా కొంతవరకు అరిగించగల ఎంజైములు మనిషి కడుపులో సిద్ధంగా ఉంటాయి.
1970తో పోలిస్తే ప్రపంచంలో మాంసాహారం వాడకం మూడింతలయింది. 2050 నాటికి వాడకం నేటి స్థాయికి రెండింతలవుతుంది. కానీ, అంతగా జంతువులను పెంచడంలో మాత్రం ఎన్నో చిక్కులున్నాయి. వాటికి తగినంత చోటు, మేత దొరకాలి. అంతకన్నా ముందు, వాటికి రోగాలు రాకుండా చూడగలగాలి. నెమరువేసే జంతువుల నుంచి వచ్చే మీతేన్ వాయువు కాలుష్యాన్ని పెంచుతుంది. ఈ మీతేన్ సమస్య కీటకాలతో ఉండదన్నది మరొక ఆశ్చర్యకరమయిన విషయం.
ఆహారం కోసం మిగతా జంతువులను పెంచడం కన్నా పురుగులను పెంచడంలో కొన్ని వెసలుబాట్లున్నాయి. పురుగుల శరీరంలో వేడిమి ఉండదు. అంటే అవి తిన్న తిండిని, ఈ వేడిని నిలబెట్టుకునే పేరున ఖర్చు చేయనవసరం లేదు. తిన్న తిండి, ఆ రకంగా ఎక్కువ శాతంగా బాడీమాస్‌లోకి (మాంసం) మారుతుంది. ఒక కిలో గ్రాము మాంసం సిద్ధం కావడానికి మిడతజాతి పురుగులకు 1.7కిలోల తిండి అవసరం. అదే ఒక కోడికి 2.2, పందికి 3.6, గొర్రెకు 6.3 కిలోల ఆహారం అవసరం.
పురుగుల శరీరంలో ఆహారంగా ఉపకరించే భాగం 80 శాతం దాకా ఉంటే, పందిలో అది 70 శాతం మత్రమే. కోడిలో ఈ శాతం 65, మేక, గొర్రెల్లో 35 మాత్రమే. మేక, గొర్రెల చర్మం మరోరకంగా ఉపయోగపడుతుందన్నది మరో సంగతి!
తేనెటీగలను తేనె కోసం, పట్టు పురుగులను పట్టుకోసం పెంచుతూనే ఉన్నారు. వాటిని ఆహారంగా కూడా వాడుకోవచ్చు. ఈత, తాడి, జాతి చెట్ల బోదెల్లో ఒక రకమయిన పురుగులు పెరుగుతుంటాయి. ఉష్ణమండల ప్రాంత దేశాలలో కొన్నిచోట్ల ఈ పురుగులను చాలా ఇష్టంగా తింటారు. ఎక్కడో పెరిగిన పురుగులను ఏరుకుని తేవడం కష్టమే. వాటిని పెంచుకోవడం సులభం. థాయ్‌లాండ్ లాంటి దేశాలలో చాలా కుటుంబాల వారు క్రికెట్ పురుగులను ఇళ్లలోనే పెంచుకుంటారు. నెథర్లాండ్స్‌లో 2008 నుంచి పురుగులను పెంచడం ఒక పరిశ్రమగా మారింది.
మన దేశంలోనే కాదు, మరెక్కడయినా మనుషులకు ఒక్కసారిగా కొత్తరకం తిండి తినడానికి మనసు ఒప్పుకోదు. ‘కప్పలు, పాములు తింటారట!’ అని వింతగా చెప్పుకోవడం మనకు తెలిసిందే. తిని బాగుందన్న తర్వాత కూడా ఆ తిన్నదేమిటో చెపితే వాంతి చేసుకునే మనస్థత్వం మనిషిది. అందుకే పురుగుల నుంచి ప్రొటీనులను తీసి తెలియకుండా తినిపించడం మంచిదంటున్నారు.


మృతసముద్రం అంటే ఏమిటి?
 November 7th, 2010

ఈ ప్రపంచంలో ఎక్కువ భాగం నీరే ఉంది. కొంత మేర మాత్రమే భూఖండాలున్నాయి. ఈ ఖండాలలో కూడా కొన్ని పెద్ద జలాశయాలున్నాయి. వాటిని కూడా సముద్రాలు అనే అంటున్నారు.



ఈ రకం జలాశయాలు లేదా సరస్సుల్లో మృత సముద్రం కూడా ఒకటి. అయితే ఇది మామూలు జలాశయం కాదు. చాలా విచిత్రమయినది. ఇందులో జీవులు లేవు. చేపలను తెచ్చి ఆ నీటిలో వదిలినా వెంటనే చనిపోతాయి. అందుకే అది ‘మృత సముద్రం!’ (డెడ్ సీ)
ఈ మృత సముద్రం ఆసియా నైరుతి భాగంలో, ఇజ్రాయెల్, జోర్డన్ దేశాల దగ్గర ఉండే ఒక ఉప్పునీటి సరస్సు.

మొట్టమొదటి విచిత్రం దీని నీటిమట్టం. ప్రపంచమంతటా జలాశయాలన్నీ సముద్రమట్టానికి సమానంగా, లేదా ఎత్తున ఉంటే, మృత సముద్రంలో మాత్రం నీటిమట్టం, సముద్రమట్టానికి 400 మీటర్లు తక్కువగా ఉంటుంది. పైగా అది రానురాను తగ్గుతున్నది కూడా! ఈ సరస్సు పొడవు 80 కిలోమీటర్లు. అత్యధిక వెడల్పు 18 కిలో మీటర్లు. అంటే వైశాల్యం వెయ్యి చదరపు కిలోమీటర్లకన్నా ఎక్కువ!

మృత సముద్రంలోకి నీరు ముఖ్యంగా జోర్డన్ నది ద్వారా వస్తుంది. అది ఉత్తర వేపున వచ్చి కలుస్తుంది. తూర్పు దిక్కున మరికొన్ని చిన్నచిన్న ప్రవాహాలు కూడా ఇందులోకి నీటిని మోసుకొస్తుంటాయి. ఇందులోంచి నీరు బయటకు పోయే మార్గం మాత్రం ఏదీ లేదు. ఎడారి కాబట్టి బాగా వేడి ఉండి, నీరు పెద్ద ఎత్తున ఆవిరయి పోతూ ఉంటుంది. జోర్డన్ నదిమీద వ్యవసాయం పేరున, ఆనకట్టులు కట్టి నీటిని మళ్లిస్తున్నారు. అందుకనే గత యాభయి సంవత్సరాలుగా మృత సముద్రంలో నీటి మట్టం తగ్గుతున్నది.

ఇక్కడ మరో విచిత్రం. మరింత ఆశ్చర్యకరంగా ఉంటుంది. మృత సముద్రం నీటిమీద మనిషి పడుకుంటే పడవలాగ తేలుతూనే ఉంటాడు. ఇందుకు కారణం ఈ నీటిలో ఉప్పు మరీ ఎక్కువగా ఉండడం. బయటి సముద్రాలకన్నా ఇక్కడి నీరు ఏడు రెట్లు ఎక్కువగా ఉంటుంది.

300 మీటర్ల లోతుకు పోతే ఉప్పు అంతా పేరుకుని ఘన రూపంలోనే ఉంటుంది. మామూలు ఉప్పుతోబాటు మెగ్నీషియం, కాల్షియం, పొటాషియంల క్లోరైడులు, మెగ్నేషియం బ్రోమైడ్ మరెన్నో లవణాలు ఇక్కడ ఊరికే దొరుకుతాయి. అందుకే ఈ నీటిలో జీవులు లేవు. ఉప్పను తట్టుకునే కొన్ని రకాల సూక్ష్మ జీవులు మాత్రం ఈ నీటిలో ఉన్నాయని గుర్తించారు.

ఖర్చు లేకుండా లవణాలను అందిస్తుందని అక్కడి దేశాల వారికి సముద్రం మీద వల్లమాలిన ప్రేమ!
తిండి - పిండి .. కూరగాయలు!.
 November 7th, 2010

మనిషి వంట చేయడం ఎప్పుడు మొదలు పెట్టాడు అన్నది పెద్ద ప్రశ్న. అదేమో గానీ, పాతరాతి యుగంనాడు మనిషి వాడుకున్న వంట సామానులు ఈ మధ్యే పరిశోధకుల కంటబడ్డాయి. కనీసం ముప్పయివేల సంవత్సరాలకు ముందే మనిషి ధాన్యాలను నూరి పిండి తయారు చేసుకున్నాడని, కూరలను కూడా వండటానికి అనువుగా సిద్ధం చేసుకున్నాడని, ఈ పరికరాలు సూచిస్తున్నాయి.
ఈ రకమయిన పరికరాలు, ఇంతకన్నా పాతకాలానికి మునుపెన్నడూ దొరకలేదు. మానవుడు, ఆదిమ మానవుడి నుంచి, ఆధునిక మానవునిగా మారుతున్న సమయంలోనే బహుశః నియాండర్‌తర్ నుంచే మొదలుపెట్టి, ఆహారంలో, మనమనుకున్నకన్నా ఎక్కువగానే, వృక్ష సంబంధ పదార్థాలను చేర్చుకున్నట్లు పరిశోధనల్లో సూచనలందాయి.
గుహలలో బతికిన ఈ మానవులకు వంట గురించి, రుచిగల తిండి గురించీ బాగా తెలుసు. ఆరోగ్యకరమయిన తిండి గురించి కూడా బహుశః తెలుసేమో? ‘వేటాడడం, లేదా తిరిగి తిండిని సేకరించడం లాంటి పనులకు మంచి చురుకుదనం అవసరం. వండిన తిండి సులభంగా అరుగుతుంది. పైగా పిండి పదార్థాలను ముడిగాకన్నా వండి తింటే రుచి ఎక్కువ’ అంటారు పరిశోధకులు అనా రెవెడిన్.
‘పిండి చేసి, దాన్ని వండుకు తినడం ద్వారా అప్పటి మానవులకు, మంచి శక్తినిచ్చే ఆహారం అందుబాటులోకి వచ్చింది’ అంటారు ఈ మానవ చరిత్ర పరిశోధకురాలు. వీరి పరిశోధనల్లో భాగం ఇటీలీ, రష్యా, చెక్ ప్రాంతాలలో అనే్షణలు జరిపారు. ఈ ప్రాంతాలలో ఆధునిక మానవులు, నియాండర్‌తర్ మానవులు ఉండే వారన్న విషయం ముందే తెలుసు. ఇక్కడ దొరికిన రుబ్బురాళ్ల వంటి రాళ్లల్లో రకరకాల అడవి మొక్కలు, గింజల అవశేషాలు, అంటుకుని ఉండడం అసలు విశేషం. ‘వీళ్లు బహుశః పిండి కలిపి వేడి రాళ్లమీద రొట్టెలు చేసుకున్నారేమో’ అంటారు పరిశోధకులు. దొరికిన మొక్కలు, గింజల రకాలన్నింటిలోనూ పిండిపదార్థం (స్టార్చ్) ఎక్కువగా ఉన్నట్లు కూడా వీరు గమనించారు.
తామున్న పరిసరాల్లో దొరికే మొక్కలు, ధాన్యాలను వీరు ఎంచుకున్నారు. అవి పండించడానికి సరిపడేవి కావు గనుక, ఆ రకాలను ఇప్పుడెవరూ తినడం లేదు. అలనాటి మానవులు, చాలా ప్రయోగాలు, అనుభవాల మీదనే తినదగిన రకాలను ఎంచుకుని ఉంటారు.


రోబో రొమాన్స్.

November 7th, 2010

1. రోబోటా అనే చెక్ మాటకు ‘విసుగు పుట్టించే పని’ అని అర్థం. అలాంటి పనులు
చేయడానికి తయారయిన యంత్రాలే రోబోలు.
2. ప్లేటో సహచరుడు ‘ఆర్కయిటాస్ ఆఫ్ హాలెండకు క్రీ.పూ. అయిదవ శతాబ్దిలో ఒక
మెకానికల్ పక్షిని తయారు చేశాడు. అది బహుశః మొదటి రోబోట్ కావచ్చు!
3. స్పిరిట్, ఆపర్చునిటీ అనే పేర్లుగల రెండు రొబోట్‌లు అంగారక గ్రహం మీద మూడేళ్లపాటు
తిరిగాయి. వాటిని తయారు చేసినప్పుడు మూడు నెలలు పనిచేస్తే చాలనుకున్నారు.
4. ఎంఐటి మీడియా వ్యాబ్ వాళ్లు రోకో అనే పర్సనల్ రోబోను తయారు చేస్తున్నారు. ఇదొక
కంప్యూటర్! కానీ ఇందులో మానిటర్‌కు బదులు తల, మెడ ఉంటాయి.
5. స్టార్‌వార్స్ క్రమంలో వచ్చిన ఆరు సినిమాల్లోనూ ఆర్-2, డి-2 అనే మరమనిషి పాత్ర ఉంది.
ఆ రోబోలో వయసువల్ల వచ్చే మార్పులేవీ లేనట్లు చూపించారు.
6. రోబోటెక్స్ నిపుణుడు హైనిక్ క్రిస్టెనె్సన్ ఒక చిత్రమయినా మాట చెపుతున్నాడు. మరో
నాలుగయిదేళ్లల్లో మనుషులకు లైంగిక భాగస్వాములు కాగల రోజులు వస్తాయట!
7. కార్నెజీ మెల్టన్ రొబోటిక్స్ సంస్థ పరిశోధకులు హాన్స్ మోరాలేక్ గారి అభిప్రాయంతో 2040 నాటికి, మానవ సమాజాన్ని అన్నిరకాలుగా నడిపించగల మరమనుషులు
వస్తారట!

Saturday, November 20, 2010

Vikasam - 1

A new weekly suppliment by name Yuva was started a couple of weeks back in the Andhra Bhoomi daily.
I am contributing a page on soft skills in that pull out.


Welcome to browse the suppliment every week.
It is really interesting.
Not that I am a contributor!
http://www.andhrabhoomi.net/features/yuva

This is the content from the first issue.

వికాసం
అనుసరించకండి.-

నిర్వహణ: విజయగోపాల్
vijayagopalk@gmail.com


November 11th, 2010

మాటయినా, మరొకటయినా, మనం ప్రతి విషయాన్నీ మరొకరిని గమనించి నేర్చుకుంటాము. ‘యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనాః’ అన్నది గీత వాక్యం. అంటే ‘గొప్పవారు ఏ మార్గంలో వెళితే, మిగతా వారంతా అదే దారిని వెళతారు’ అని అర్థం! కానీ, మనముందు దారితీస్తున్న వారంతా, గొప్ప వాళ్ళనే నమ్మకం ఉందా? లేదు గనుకనే సూక్తి కూడా మారింది. ‘గతానుగతికో లోకః’ అని కొత్త మాట. దీనికి తెలుగు చెప్పాలంటే ‘గొర్రెదాటు’ అన్న ఒక్క మాట చాలు. గొర్రెలకు గొప్ప తెలివి ఉండవలసిన అవసరం లేదు. కానీ గుంపు వెళుతూ ఉంటే, దారికి ఏదో ఒక అడ్డు వస్తుంది. అప్పుడు యజమాని వచ్చి అదిలిస్తే, ముందున్న ఒక గొర్రె, అడ్డుమీదనుంచి ముందుకు దూకుతుంది. అంతే! తరువాత ఒకదాని వెంట మరొకటి అన్ని గొర్రెలూ దూకుతాయి, అడ్డు తొలగినా సరే, అవి అలా దూకుతూనే పోతుంటాయి. వింత ఏమిటంటే అనుసరించడమన్న విషయానికి వచ్చేసరికి, తెలివిగల మనిషికి, తెలివిలేని గొర్రెలకూ అంత తేడా కనిపించదు! ‘ఎందుకు చేస్తున్నారు ఈ పని!’ అనే ప్రశ్నకు మామూలుగా జవాబు ‘అందరూ చేస్తున్నారు గనుక!’ అని వస్తుంది. ఇందుకు ఎన్ని ఉదాహరణలయినా మీరే ఊహించుకోవచ్చు. మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఒకసారి ఒక క్రాస్ కంట్రీ రేస్ జరిగింది. పరుగు మొత్తం ఏడు మైళ్లదూరం జరగాలి. పరుగు మొదలయింది. రెండు గంటల తర్వాత, ముందు నిర్ణయించిన మార్గంలో ఒక్క పురుగు (పరుగు తీసే వ్యక్తి!) కనిపించలేదు. ఏమి జరిగింది? ఏదో జరిగిందని అర్థమవుతూనే ఉంది. అధికారులు వెంటనే కారుల్లో వస్తుంటారు గనుక సంగతిని సులభంగానే అర్థం చేసుకోగలిగారు. పోటీదారులందరూ దీక్షగా, మరెక్కడో పరుగు పెడుతున్నారు. నిజానికి పరుగు ముగియవలసిందన్న సంగతి కూడా పట్టకుండా వారంతా పరుగుతీస్తున్నారు. అందరికన్నా ముందు పరుగెత్తుతున్న వ్యక్తి, ఒకచోట, తప్పుదారి మళ్లాడు. అందరూ అతని వెంటే, తప్పుదారిలో పరుగెత్తారు! మామూలు మనిషి తన జీవితకాలంలో కనీసం పదివేలమందిని ప్రభావితులను చేయగలడని పరిశోధకులు జాన్ మాక్స్‌వెల్ అంటున్నారు. ఇక నాయకులుగా వారు మరింత ఎక్కువ మందిని ప్రభావితులను చేస్తారు. నాయకత్వం రాజకీయంలోనే కానవసరం లేదు. చిన్నపిల్లలలోనూ స్వతహాగా ‘రా! చూపిస్తా!’ అనగలిగిన నాయకులుంటారు! అందుకే నాయకులుగా ముందుకు సాగుతున్నా, అనుసరించే వారుగా మరొకరి వెంట వెళుతున్నా మనం సరయిన దారిలో వెళుతున్నామా? అని ప్రశ్నించుకోవలసిన అవసరం ఎంతో ఉంది! సరయిన దారిని గుర్తించవలసిన అవసరం అంతకన్నా ఎక్కువగా ఉంది! మనం ఒక నిర్ణయం చేస్తే, అది ప్రత్యక్షంగా, పరోక్షంగా, మనల్నేగాక మరెందరినో ప్రభావితులను చేస్తుంది. సరయిన మనుషులు సరయిన నిర్ణయాలు చేస్తే, అందరికీ బాగుంటుంది! సరయిన నిర్ణయాలు చేయడం అలవాటుగా మారాలి మరి.

***

‘ముందువారితో సమంగా పోతే చాలు!’ అనుకున్నంత కాలం గుంపులో ఒకరిగా ఉండిపోవలసిందే.

=============



అది మీ చేతుల్లో ఉంది

ఇద్దరు కుర్రవాళ్లు ముల్లా నస్రుద్దీన్‌ను ఆట పట్టించాలని పథకం వేశారు. వాళ్లు ఒక చిన్న పురుగును పట్టుకున్నారు. రెండు చేతులను పురుగుచుట్టూ గుండ్రంగా పెట్టి ముల్లా దగ్గరకు తీసుకెళ్లారు. పురుగు బతికి ఉందా? చచ్చిందా? అని అడిగారు. అతను చెప్పిన జవాబును అబద్ధం చేయడం సులభమే. ‘చచ్చింది’ అంటే పురుగును వదిలేయాలి. ‘బతికి ఉంది’ అంటే, అదిమి చంపి చూపాలి! అది వారి పథకం.

ముల్లా దగ్గరికి వెళ్లి, ప్రశ్న అడిగారు.

‘ఈ చేతుల్లో ఉన్న పురుగు చచ్చిందా? బతికి ఉందా?’ అని.

‘ఆ సంగతి మీ చేతుల్లో ఉంది!’ అన్నాడు ముల్లా!



=============

ఇంటర్వ్యూలో...

కమిటీవాళ్లు మనకు శత్రువులు కారు. మనలోనుంచి తగినవారికోసం వాళ్లు వెదుకుతున్నారు. ‘మీరు వెదుకుతున్న మనిషిని నేనే!’ అని వారిని నమ్మించడం మనవంతు. ఆ పని చేయగలిగితే, అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇవ్వకుండానే మనం ఉద్యోగం చేజిక్కించుకోవచ్చు.

గమనించండి...

ఏం జరుగుతుందని ఊహించకండి. ఊహించనిదాన్ని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండండి.

హాయిగా రిలాక్స్ అయే ప్రయత్నం చేయండి! నో టెన్షన్స్!

మీ వేషం, భాషా ముఖ్యం! కానీ అవే ముఖ్యం కావు.


అతి వినయం మంచిది కాదు. నిజంగా మీరు నమ్ముతున్న సంగతి గురించి (కొంతవరకు) వాదించినా తప్పులేదు.


తెలియని విషయం, తెలియదనడం మంచిది. తెలియదు అన్న దాకా ప్రశ్నలు వచ్చిపడుతూనే ఉంటాయి.


తికమకపడవద్దు. అప్పుడే మరిచానన్నట్లు, బుర్రగోక్కోవద్దు.


వాళ్లు చికాకుపెట్టే ప్రయత్నం చేస్తారు. చికాకు పడవద్దు.


అనవసరంగా చర్చకు దిగవద్దు.


మీరూ (సరయిన) ప్రశ్నలు అడగవచ్చు! ఇంటర్‌వ్యూలను తట్టుకోవడం తెలిసిన తర్వాత, ఇక వాటి అవరం ఉండదు!

===============



మరొకరితో... మరికొందరితో...

ఇంట్లోగానీ, సంఘంలోగానీ, చదువులోగానీ, ఉద్యోగంలో గానీ, ఎటువెళ్లినా మనకు మనుషులు ఎదురవుతారు. బాగా బతకడమంటే, ఈ మనుషులతో కలిసి బాగా బతకడమని అర్థం చేసుకోవాలి. బాగా బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి. వాటిలో కొన్ని...!


మనమొకచోటికి వెళితే ‘అబ్బా! ఎందుకువచ్చాడూ!’ అనిపించుకోకుంటే మంచిది. అందరితోనూ కలుపుగోలుగా ఉండడం ఎంతో అవసరం. ఇది అనుకున్నంత సులభంగా వీలయేది కాదు.


ప్రతి సంఘటనకూ, మాటకూ ఎక్కువగా చలించకూడదు. వెంటనే ప్రతిచర్యనూ, ప్రభావాన్ని చూపకుండా ఉండగలిగితే మంచిది. చిన్న చిన్న విషయాలను అసలు పట్టించుకోకుండా ఉండగలిగితే మేలు!


మనకు అందరిలోనూ నిజమైన ఆసక్తి ఉందన్న భావాన్ని, నడవడినీ అలవాటు చేసుకోవాలి. అందరిపేర్లనూ గుర్తుంచుకుంటే ఎంతో మంచిది. అరుదుగా కలిసే వారినయినా, పేరు గుర్తుంచుకుని పలకరించి చూడండి. ప్రభావం ఎలాగుంటుందో మీరే గమనించవచ్చు.


అందరికీ మనలోనూ ఆసక్తి కలిగేలా ప్రవర్తించడం ఒక కళ. అది పట్టుబడిందంటే, ఎదుటివారిని మనవారుగా మార్చుకోవడం సులభమవుతుంది.


ఇలాంటి సూత్రాలు ఎన్నో ఉన్నాయి. వీటిని గురించి చెప్పడం సులభం


అనుసరించడం అంత సులభం కాదు. కష్టం మాత్రం అంతకన్నా కాదు!



==============

నిజమైన చిత్రం

మనిషి తన గురించి తానొక రకంగా ఊహించుకుంటాడు. మిగతావాళ్లు ఆ మనిషి గురించి ఏదో అనుకుంటారు. ఆ మనిషికి అసలు స్వరూపం ఒకటి ఉంటుంది. తాను మరేదో కావాలన్న ప్రయత్నమూ ఉంటుంది. వీటన్నిటినీ కలిపితే, ఆ మనిషి అసలు చిత్రం వస్తుంది.


-డోర్ షారీ.

I would like your comments please!!
&&&&&&&

Friday, November 19, 2010

Yaminipoorna Tilaka - A Radio Drama

This is an interesting drama.
Radio adaptation of Bilhaneeyam, the famous kavyam.

Sri Sesham Ramanujacharya was the author.
I should confirm whether the verses were adapted from an earler work.

Usually radio dramas are of the length of 60 minutes or less.
This one goes a little longer.
When the drama was put on AIR first, it ended abrupltly at the 60th minute leaving the listeners in a situation.

The drama was again b'cast within a few days in its full version.

Prof G V Subrahmanyam, a well known writer and critic did the role of Bilhana.
Did he ever act in any other radio drama?
He was of course taking part in the much acclaimed "Bhuvana Vijayam" those days.
He did a memorable role.

Smt Sarada Srinivasan as Yamini in is unparalelled.
There is a sequence towards the end of the play where she goes on in a monologue kind of dialogue shifting moods without an effort.
I asked her whether the scene was recorded in a single take. She said "Yes!"
It shows!
That is talent!!

I request all my friends to listen to this play!

Here is the link from where You can download the tarcks.

Yaminipoorna Tilaka - Radio Play

Let us enjoy great works with words!!
@@@@@

Wednesday, November 17, 2010

Camille Corot - A Painting

Is it a painting?
I thought it is a photograph!
With all those lights and shades!
Hats off to the artist!!!


Let us enjoy great works of arts!
^^^^^^

Tuesday, November 16, 2010

Srikurmam in Andhra Pradesh

Srikurmam is an important Vaishnavite temple place.
The following are some images of the Kurmanatha temple there.

Entarnce


The Sanctum


The Corrodor - No two pillars are similar here!


A small sanctum


An inscription.
There are many all over the the temple.


Let us enjoy the glory of the places!
!!!!!

Sunday, November 14, 2010

Jeremy Rifkin on "the empathic civilization" | Video on TED.com

Earlier this site used to allow embedding the videos.
Now it appears they don't.

However this is a highly useful "animated talk"
You don't see the speaker.
There is a wonderful two dimensional animation visualising the talk!

I am sure you would like it!

Jeremy Rifkin on "the empathic civilization" Video on TED.com

Let us enjoy great works of creativity!!
#####

Medha - 3

Here is the third instalment of Medha, the sciene page in Andhra Bhoomi.
This appeared in print on 2nd November 2010

Now the page appears on Mondays and in colour!

Here is the link to the weekly page!
Visit every week and read a lot of interesting material!

http://www.andhrabhoomi.net/features/intelligent

Now, let us enjoy some reading here itself!
Do I have to tall that I am contributing this page?

‘మంచి’నీరు మిగులుతుందా?.
November 1st, 2010


ఈ సంవత్సరం ‘వద్దనే’వరకు వానలొచ్చాయి. కనుక, కొన్నాళ్లవరకు మంచినీళ్లకు కొదువ ఉండదేమోనని అనిపించింది. పేపర్లో, ఎక్కడో ‘వాటర్ మెయిన్’ అంటే, నీటిని నగరందాకా తెచ్చే పెద్ద గొట్టం, పగిలి, నీరంతా పోతున్న ఫొటో కనిపించింది. నీళ్లు, ఎప్పటికైనా సమస్యే.

ఈ సంవత్సరం జూన్ 28న జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ ఆసెంబ్లీలో ‘పరిశుభ్రమైన తాగునీరు’, ‘ప్రాథమిక పారిశుధ్యం’ అన్న రెంటినీ మానవ హక్కులుగా గుర్తించారు. కానీ ప్రపంచంలో ఒక బిలియన్‌కు పైగా జనానికి ‘మంచినీరు’ అనే వసతి లేనేలేదు. ఉందనుకుంటున్న చాలాచోట్ల, ఆ నీరు ‘మంచి’ గురించీ, మోతాదు గురించీ సమస్యలు ఉండనే ఉన్నాయి. మరో రెండున్నర బిలియనుల పైగా జనానికి పారిశుధ్య వ్యవస్థ అంటే ఏమిటో తెలియదు.

దొరుకుతున్న నీటిలో అయిదింట నాలుగు వందలు, వ్యవసాయం, పరిశ్రమలకు ఖర్చవుతున్నది. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నీటికి ముఖ్యమైన చోటుందని అర్థం. మునుముందు దేశాల మధ్యన సంబంధాలకు (బహుశః పోరాటాలకు) చమురు వగైరాలకన్నా వీరే ముఖ్య ప్రాతిపదికగా ఉంటుందని యుఎన్ వారే అంటున్నారు.

మొత్తానికి ప్రపంచమంతటా, అందరి దృష్టి ప్రస్తుతం నీటి మీద ఉంది. నీటిని వాడడంలో, పొదుపులో, తిరిగి వాడడంలో కొత్త పద్ధతుల గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. నిలదొక్కుకోగల నీటి నిర్వహణ పద్ధతుల గురించి సదస్సులు జరుగుతున్నాయి.

అది ఎడారిగానీ, మహానగరం మధ్యనగానీ, గాలిలోనుంచి నీటిని తీయవచ్చునని ఫ్రవున్‌హాఫర్ పరిశోధనా సంస్థవారు అంటున్నారు. ఒక ఎత్తయిన గోపురం వంటి నిర్మాణంలో ఉప్పు ద్రావణం తిరుగుతూ ఉంటుంది. అది వాతావరణంలోని తేమను పీల్చుకుంటుంది. అక్కడినుండి ఆ ద్రావణం ఒక ఎత్తులో ఏర్పరచిన ట్యాంకులోకి చేరుతుంది. అక్కడ అది సౌరశక్తి ఆధారంగా మరుగుతుంది. ఆవిరయిన నీటిలో ఏ ఉప్పూ ఉండదు. దాన్ని చల్లబరిస్తే ‘మంచినీరు’ దొరుకుతుంది. నీటిని వదిలిన ఉప్పు ద్రావణం తిరిగి గోపురంలోకి వస్తుంది. కార్యక్రమం చక్రంగా జరుగుతూనే ఉంటుంది. ఇందులో విద్యుత్తును వాడుకునే ప్రసక్తి లేదు. కాలుష్యం కలిగించనిదీ, ఎంతకాలమయినా తరగకుండా అందుతూనే ఉండేదీ అయిన ఎండ లేక సౌరశక్తి ఇక్కడ ఇంధనం. విద్యుత్తు అసలు లేని చోట కూడా ఈ పద్ధతిని వాడుకోవచ్చు. వర్షాలు తక్కువగా ఉండే చోట్ల మంచినీటి సమస్యకు ఇది మంచి సమాధానం.

మంచినీటి సరఫరా వ్యవస్థను మరింత బాగా నడపడానికి, గొట్టాలు పగిలి, మరో రకంగానూ వచ్చే లీక్‌లను మరింత సులభంగా గుర్తించడానికి కూడా మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నీటిని వాడుకుంటున్న, సరఫరా చేస్తున్న పద్ధతులను కంప్యూటర్లద్వారా పరిశీలించగలిగితే, సులభంగా సమస్యలు తెలుస్తాయి. సమస్యలకు, అంతే సులభంగా సమాధానాలు తెలుస్తాయి. లీకులుంటే క్షణాల్లో వాటి చోటు, తీరు తెలిసిపోతుంది. వెంటనె తగిన ఏర్పాట్లు చేయవచ్చు. ఆశ్చర్యం ఏమిటంటే, ఈ రకం కంప్యూటర్ ప్రోగ్రాములను మంగోలియా, లిబియా, సౌదీ అరేబియాలంటి దేశాలలో వాడుతున్నారు. వారికి నీళ్లు కరువు. నీటి విలువ బాగా తెలుసు. కనుక వారు త్వరగా మేలుకున్నారు. మంచి పద్ధతులను వాడుతున్నారు. మన దేశంలో, ఈ ఆలోచన త్వరలోనే వస్తే, పరిస్థితి చేయిదాటకముందే అదుపులోకి వస్తుంది.

మన దేశంలోగానీ, మరెక్కడయినా గానీ, గొట్టాలలో చాలాభాగం నీరు లీకుల కారణంగా మట్టిపాలవుతుంది. గొట్టం పైకి కనిపించేదయితే వీలుగా దానికి రంధ్రంపెట్టి, నీటిని మరోవేపు మరలించిన దాఖలాలూ మన దగ్గర ఉన్నాయి. మొత్తానికి ప్రభుత్వ ధనంలాగే, నీరు కూడా చివరన అందవలసిన వాటికి అందదని అర్థం. అల్ట్రాసౌండ్, ఇంటలిజెంట్ సెన్సర్స్ సాయంతో వీటి పరిస్థితిని గుర్తించే పద్ధతులున్నాయి. ఈ రకంగా మంచినీటి వ్యవస్థలో, పారిశుద్ధ్య వ్యవస్థలోనూ గొట్టాలలో లోపాలనూ, లీకులనూ సులభంగా కనుగొని, తగిన ఏర్పాట్లు చేయవచ్చు.

నీటిని శుభ్రపరచడంలో వజ్రాన్ని వాడుకునే పద్ధతి ఒకటి వచ్చింది. డైమండ్ కోటెడ్ ఎలక్ట్రోడ్‌లను నీటిలోకి ప్రవేశపెడితే, సూక్ష్మజీవులు, విషరసాయనాలు మొదలు, కార్బన్ ఉండే ఏ కాలుష్య పదార్థాన్నయినా అవి ఆకర్షిస్తాయి. నీటిలో కొన్ని రకాల లవణాలు, కార్బన్ డయాక్సయిడ్ మాత్రం మిగులుతాయి. వాటివల్ల ఆరోగ్యానికి ఏ రకంగానూ నష్టం జరగదు. ఈ పద్ధతితో సులభంగా కాలుష్యం, సూక్ష్మజీవులు లేని నీటిని తయారుచేసుకోవచ్చు.

పరిశ్రమల నుంచి బయటపడే నీటిలో హెవీ మెటల్స్, విషరసాయనాలు, రకరకాల సంక్లిష్ట రసాయనాలు కలిగి ఉంటాయి సమస్యలు రావడం తెలిసిందే. ఈ రకం నీటిని వదిలించుకోవడం నిజంగానే కష్టం. పరిశోధకులు ఇందుకు కూడా తగిన మార్గాలు తయారుచేశారు.

నీరు ప్రాణాధారం! నీరు లేనిదే మన మనుగడ లేదు. సరైన సమయంలో మనం నీటిని గురించి పట్టించుకోకుంటే భవిష్యత్తు నరకమవుతుంది.



‘కింగ్’ పెంగ్విన్స్.
November 1st, 2010

పెంగ్విన్‌లో చక్రవర్తులున్నాయి. సహజంగానే ఎంపరర్ పెంగ్విన్స్ ఆకారంలో అన్నిటికన్నా పెద్దవి. ఆ తర్వాత వచ్చేవి ‘కింగ్’ పెంగ్విన్స్, ఇవి ఒక్కొక్కటి మూడు అడుగుల ఎత్తు, 30 పౌండ్ల బరువు ఉంటాయి. ఇలాంటి పెంగ్విన్‌లను ఒకే చోట సుమారు 20 లక్షల వరకు చూడాలంటే, అంటార్కిటాకు ఉత్తరంగా 1400 మైళ్ల దూరంలోని క్రోజెట్ ద్వీప సమూహంలోని పొజెషన్ దీవికి వెళ్లాలి.

అక్కడికి చేరకముందే బడివదిలిన తర్వాత పిల్లల గోలలాగ పెద్ద రొద వినపడుతుంది. బడిలోలాగే అరుపులు, కీచులాటలు, సమరస సంభాషణలు అన్నీ ఉంటాయి. దీవికి మరింత దగ్గరవుతుంటే, ముక్కులు అదిరిపోయే తీరుగా వాసన మొదలవుతుంది. కుళ్లిన చేపల కంపుతో కలిసి, పెంగ్విన్‌ల రెట్ట (గ్వానో)నుంచి అమోనియా ఘాటు! చెవులు, ముక్కులకు ముందుగా రాజుల సంగతి తెలుస్తుంది.

మరింత దగ్గరగా పోయి, దీవిలో, సముద్రానికి దగ్గరగా వుండే ఒక లోయలోకి చూడగలిగితే మన కళ్లను మనం నమ్మలేని దృశ్యం కనపడుతుంది. రాజకీయ సభనో, సంగీత కార్యక్రమాన్నో చూడడానికి వచ్చి, క్రమశిక్షణగా నిలబడిన జనంలాగ లోయలో వేలకు వేలు పెంగ్విన్‌లు కిటకిటగా నిలబడి ఉంటాయి. దక్షిణార్ధగోళంలో వేసంగి కాలం వచ్చిందంటే కింగ్ పెంగ్విన్స్ జంటకట్టి పిల్లలను కనడానికి, ఈ దీవికి వచ్చి మూడు నెలలు గడుపుతాయి. పెంగ్విన్ల కాళ్లు చాలా చిన్నవి. శరీరం పెద్దది. అవి నీటిలోనైతే చాలా చలాకీగా కదలగలవు. కానీ, వాటికి నేలమీద నడవడం, ఈ తరుణంలో తప్పదు. కింగ్ పెంగ్విన్‌ల తల, ముక్కు, మెడ, ఎదల మీద అందమైన నారింజరంగు ఉంటుంది.

ఈ అందమైన ప్రాణులు పొజెషన్ దీవుల్లో పిల్లలను కనడానికని ఆరు స్థలాలను ఎంపిక చేసుకున్నాయి. అందులో అన్నిటికన్నా పెద్ద ప్రాంతం 90 ఎకరాలు వుంటుంది. అంత స్థలంలో వేలాది పెంగ్విన్‌న్లు వుండగలుగుతాయంటే, అందులో ఒక రహస్యం ఉంది. ఒక్కొక్క పెంగ్విన్ తనదంటూ, తాను నిలబడేందుకు వీలుగా ఉండే స్థలం దొరికితే సంతృప్తిపడుతుంది. మూడు నెలలూ అక్కడే నిలబడి ఉంటుంది. పెంగ్విన్‌లు వస్తుతః పక్షులే అయినా వీటికి గూడుకట్టే అలవాటు లేదు. సముద్రంనుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదట వాటి పాత చర్మం పోయి కొత్త చర్మం వస్తుంది. ఆ తర్వాత అవి జోడును వెతుక్కుంటాయి. అన్నింటికీ నేస్తం దొరకాలని లేదు!

జంట కట్టినవి ఒకే ఒక గుడ్డు పెడతాయి. ఆడా మగా వంతుల వారీగా ఆ గుడ్డును పొదుగుతాయి. నిలబడే వుండి గుడ్డును రెండు కాళ్ల మధ్యన నిలుపుతాయి. దానిమీద పొట్టనుంచి చర్మం మడత ఒకటి వచ్చి కుప్పుకుంటుంది. గుడ్డులోనుంచి పిల్ల వచ్చి దానికి ఈకలు పెరిగే దాకా, ఈ నిలువుజీతం కొనసాగవలసిందే!

మూడు నెలల కాలం ప్రశాంతంగా గడిస్తే, ఏ సమస్యా ఉండదు. గుడ్లు, పిల్లలను ఎత్తుకుపోవడానికి పెట్రిల్స్, స్కువిజ్ పక్షులు అనుక్షణం ప్రయత్నం చేస్తుంటాయి .వాటిని ముక్కుతో పొడిచి తరుముతుంటాయి పెంగ్విన్లు. వరసగా నిలబడిన నాలుగు గంటల సమయంలోఒక పెంగ్విన్ శత్రువులను రెండువేలసార్లు పొడిచినట్టు పరిశీలకులు గమనించారు. ఇంతయినా లోయలో గందరగోళం మాత్రం లేదని వాళ్లే అంటున్నారు. ‘మిలటరీ కవాతులో నిలబడ్డ జవానుల్లాగ పెంగ్విన్‌లు తమ తమ నెలవుల్లో అలా కొనసాగడం ఆశ్చర్యకరంగా ఉంటుంది’ అన్నారు పరిశీలకులు.

హిందూ మహా సముద్రం, అట్లాంటిక్‌లలో కలిసి మొత్తం ఏడు దీవుల్లో పెంగ్విన్లు, తమకోసం స్థావరాలను ఎంపిక చేసుకున్నాయి. అంటార్కిటికా చల్లని నీరు, ఇవతలి వచ్చే నీరు కలిసే సరిహద్దు ప్రాంతంలో ఈ దీవులున్నాయి. అక్కడ పెంగ్విన్లకు ఆహారం కావలసినంత దొరుకుతుంది. తిండికోసమని బయలుదేరి ఇవి 250 కిలోమీటర్లు ఈదుతాయట. స్క్విడ్, లాంటర్న్‌ఫిష్ అనే సముద్ర జీవులు లోతుల్లోగానీ దొరకవు. అవే పెంగ్విన్ల అభిమాన ఆహారం.

ఈ దీవులు అన్నింటా కలిసి పెంగ్విన్ల ‘జంటల’ సంఖ్య 22 లక్షలు!

వీటికి రానురాను తిండి దొరకడం కష్టమయ్యే సూచనలున్నాయట. ప్రస్తుతం మాత్రం ఈ ‘మహరాజు’లే నయం! మనకన్నా క్రమశిక్షణతో మహరాజుగా బతుకుతున్నాయి!



కాలం కబుర్లు!!
.November 1st, 2010

* శరీరానికి టైం ఎలా తెలుస్తుందో ఎప్పుడైనా ఊహించారా?


* మెదడులోని ‘హైపొతలామస్’ అనే భాగంలో ‘మాస్టర్ క్లాక్’ ఉంటుంది. అక్కడే సమయానికి చెందిన లయ నడుస్తుంది.


* జన్యువులు, ప్రొటీన్ల ద్వారా చర్య మొదలయ్యి, పీనియల్ గ్రంథిలోని మెలటోనిన్ మీద ప్రభావం పుడుతుంది. మనం ఎప్పుడు పడుకోవాలి అనే నిర్ణయం, మెలటోనిన్ ద్వారా జరుగుతుంది.


* ఈ కార్యక్రమం, ఏ మాత్రం పొల్లు పోకుండా కొనసాగుతుంది.


* కానీ మనం ఈ గడియారాన్ని, బయటి ప్రపంచంలోని వెలుతురు, ఇతర విషయాలతో ముడిపెడతాము.


* ఈ రెండు గడియారాలు ఒకే టైంకు చేరడానికి టైం పడుతుంది.


* అందుకే, మరో దేశానికి ప్రయాణించి వెళ్లినవారు ‘జెట్‌లాగ్’కు గురవుతారు. వారి నిద్రకూ, బయటి వెలుతురుకు సంబంధం ఉండదు.


* వెలుగు తెలియకుండా, బంధించి ఎంతకాలం ఉంచినా, ఆ వ్యక్తికి నిద్ర సమయం సక్రమంగా తెలుస్తూనే ఉంటుంది.


ఆశ్చర్యంగా...


* ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు కాలం నెమ్మదిగా నడిచినట్లు అనిపిస్తుంది.


* సరదాగా గడుస్తుంటే, అప్పుడే ఇంతకాలం గడిచిందా అనిపిస్తుంది.



చెట్లు - తుపానులు.
November 1st, 2010

మన ఇళ్లముందు మొదలు, కొండలమీద దాకా రకరకాల, మొక్కలు చెట్లు ఉంటాయి. అటు సముద్రం అడుగున మొదలు, అక్కడి నీటిమీద తేలుతు రకరకాల మొక్కలు ఉంటాయి. సముద్రం నీరు, రంగు రంగులుగా కనిపించడానికి ఈ తేలుతూ ఉండే మరీ చిన్న, ఫైటోప్లాంక్టనే్ల కారణం. అవి తుఫానులకు కూడా కారణం అంటున్నారు పరిశోధకులు.

తుమ్మెద రెక్కలు అల్లాడిస్తే, ప్రపంచంలో మరో మూల తుఫాను పుట్టడం గురించి సిద్ధాం ఉంది. కానీ, అది కేవలం సిద్ధాంతం. ఈ తుఫాను నిజం!

సముద్రం రంగులను గమనించి, రాబోయే తుఫానుల గురించి ముందే వివరాలను సూచించే పద్ధతి వస్తుందని పరిశోధకుల అభిప్రాయం. సముద్రం నీరు, కల్మషం లేకుండా ఉంటే ముదురు నీలం రంగులో కనబడుతుంది. తేలియాడుతుండే ఈ మొక్కలు ఉంటే మాత్రం ఆ నీలం రంగు మురికిగా మారుతుంది. సముద్రంలో బతికే ప్రాణుల ఆహార వలయానికి ఈ మొక్కలే ఆధారమని ముందుగా మనం గుర్తించాలి. ఈ మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా, తిండిని సిద్ధం చేస్తేనే, ఆహార వలయం కొనసాగుతుంది.

ఫైటోప్లాంక్టన్ కారణంగా వాతావరణంలో మార్పులుంటాయని తెలుసు కానీ మరీ తుఫానులకు ఇవి కారణమవుతాయన్న ఆలోచన ఈ మధ్యనే పుట్టింది. న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో ఆనంద్ జ్ఞానదేశికన్ అనే పరిశోధకుడు కంప్యూటర్ మాడలింగ్ ద్వారా పరిశోధనలు ప్రారంభించాడు. ఉత్తర పసిఫిక్‌లోని ఒక ప్రాంతం గురించి అతని పరిశోధన సాగింది. ఆ ప్రాంతంలో నీరంతా శుభ్రంగా నీలంగా ఉంటే తుఫానుల తాకిడికి 70 శాతం తగ్గి ఉన్నట్లు తెలిసింది. కానీ, ‘ఇది ఎట్లా జరుగుతుంది?’ అన్నది ప్రశ్న.

నీరు శుభ్రంగా ఉంటే, సూర్యుని వేడిమి, అందులో వంద మీటర్ల లోతు దాకా చొచ్చుకుపోగలుగుతుంది. కానీ, మొక్కలు ఉండే ప్రాంతంలో వేడి అయిదునుంచి పది మీటర్ల కన్నా ఎక్కువ లోతుకు చేరదు. అంటే, మొక్కలు విస్తరించి ఉన్న ప్రాంతాలలో, పైభాగంలోని నీరు బాగా వేడెక్కుతుందని అర్థం. శుభ్రమైన నీరయితే, ఆ వేడి లోతుదాకా వ్యాపిస్తుంది. వేడి లోతుకు చేరితే అక్కడి ప్రవాహంతో బాటు, అది సముద్రంలో బాగా దూరాలవరకు చేరుతుంది. సముద్రాలలోని నీరు నిరంతరం కదులుతూ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. వేడి అట్లా వ్యాపించిందంటే, పైన సముద్రం చల్లగా ఉంటుందని వేరుగా చెప్పనవసరంలేదు. ఆ చల్లదనం, అక్కడి గాలి కదలికల మీద ప్రభావం చూపిస్తుంది. సముద్రం ఎంత చల్లబడి ఉంటే తుఫానులు అంత తక్కువగా వస్తాయి. గతంలో గుర్తించిన ఉష్ణోగ్రతల రికార్డును, ఆయా సమయాలలో వచ్చిన తుఫానులను పరిశీలించిన తర్వాత, ఈ విషయం నిజమేనని రుజువయింది. అట్లాంటిక్ ప్రాంతంలో వచ్చే తుఫానులకు కూడా, పసిఫిక్ నీటి చల్లదనంతో సంబంధం ఉందని తెలిసింది. చల్లదనానికి, అక్కడ పెరిగే చిన్న మొక్కలకు సంబంధం ఉందని మరింత బాగా తెలిసింది!

గ్లోబల్ వార్మింగ్ కారణంగా, ప్రపంచంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంటున్నారు. సముద్రాలమీద వేడి పెరిగితే, ఫైటోప్లాంక్టన్ పెరుగుదల అంత బాగా సాగదు. ఈ మొక్కలు, వేడి ఎక్కువయితే పెరగవు. వేడి ఎక్కువయేకొద్దీ తుఫానులు తగ్గుతాయని పరిశోధకుల అభిప్రాయం.

సముద్రం మీద మొక్కల పెరుగుదలను ప్రభావితం చేసే అంశాలలో వేడిమి ఒకటి. మిగతా అంశాల గురించి ఇంకా పరిశోధనలు జరగాలి.



మొక్కల కారణంగా అనారోగ్యం వస్తుందా?.
November 1st, 2010

మనుషులకు బ్యాక్టీరియా, వైరసులు, బూజు జాతి ఫంగసులు సోకి రకరకాల అనారోగ్యాలు వస్తాయి. చిన్నా పెద్దా జంతువుల కారణంగా వచ్చే అనారోగ్యాలు మామూలే! అయితే, మొక్కల కారణంగా అనారోగ్యం వస్తుందా?

మొక్కల కారణంగా అనారోగ్యం కొత్త ఏమీ కాదు. చాలామందికి పచ్చివేరు శెనగకాయలు తింటే, ప్రాణం మీదకు వచ్చే పరిస్థితి అవుతుంది. ఇక రకరకాల మొక్కల పుప్పొడి కారణంగా ఉబ్బసం లాంటి జబ్బులకు గురయేవారి సంఖ్య రోజురోజూకూ పెరుగుతున్నది. పిచ్చిమాసుపత్రి లేదా కాంగ్రేసు గడ్డి అనే పార్థీనియం మొక్క ఎంత ఎత్తుంటే అంత ఎత్తూ విషమే. అదేమో పల్లెలు, పట్నాలు తేడా లేకుండా ఎక్కడబడితే అక్కడ పెరుగుతుంది. అమెరికావారు దయతలచి దానం చేసిన గోధుమలతో కలిసి వచ్చిన ఈ మొక్క విత్తనాలు ఇవాళ దేశంలో నలుమూలలా విస్తరించి, తోటల్లాగే పెరుగుతున్నాయి.

మొక్కలను, పాతొజెన్స్, అంటే రోగకారకాలు అనడానికి ఒక ఇబ్బంది ఉంది. అవి శరీరంలోకి ప్రవేశించి, మిగతా రోగకారకాలలాగా పెరగడం కుదరదు. మొక్కలు పెరగాలంటే, లోపల ఎండ ఉండదు కిరణ్యజన్య సంయోగక్రియ వీలుగాదు.

మొక్కలకు సంబంధించిన పదార్థాలు మాత్రమే రోగకారకాలు! 1894లో హెచ్.జి.వెల్స్ అనే రచయిత ‘ద ఫ్లవరింగ్ ఆఫ్ ది స్ట్రేంజ్ ఆర్కిడ్’ అని ఒక కథ రాశాడు. కానీ, అది నిజంగా కల్పన మాత్రమే. ఫెర్న్ జాతి మొక్కలమీది నూగును తింటే కాన్సర్ వస్తుందని పరిశోధకులు గమనించారు. ఆ మొక్కల పుప్పొడితో జలుబు వస్తుంది.

మొక్క మీద పెరిగిన బూజులు, ఇతర ప్రాణులు మనుషులకు సోకి జబ్బులు వస్తాయి. ఇది సాధారణంగా చాలా కాలంగా జరిగేదే!

సూదిగా ఉండే విత్తనాలు కొన్ని జంతుల వెంట్రుకల ద్వారా వాటి శరీరాల్లోకి చేరుకుంటాయి. అలా మనుషుల విషయంలోనూ జరగవచ్చు. దక్షిణ ఆఫ్రికాలో ఒక అమ్మాయి కిడ్నీలోకి అలాంటి విత్తనం ఒకటి చేరి అక్కడ పెరగడం మొదలుపెట్టింది. కానీ మొక్కల విత్తనాలు పెద్దవిగనుక అంత సులభంగా జంతువులు, మనుషుల శరీరాలలోకి చేరజాలవు.

ఒక పెద్దమనిషి ఊపిరితిత్తులలో ఫర్‌చెట్టు పెరుగుతున్నదన్న వార్త ఈ మధ్యన బాగా ప్రచారంలోకి వచ్చింది. అతను పైన్ చెట్లను నరుకుతున్న సమయంలో ఒక విత్తనం ఊపిరితిత్తుల్లో చేరింది. అది పెరుగుతుంటే దాని చుట్టూ సిస్ట్ పెరగసాగింది. కాన్సర్ అన్న అనుమానంతో ఆపరేషన్ చేసి తీస్తే అందులో చిన్న మొక్క కనిపించింది. ఇది ఇంగ్లాండ్‌లో జరిగింది.

ఇంగ్లండ్‌లోనే మరొక వ్యక్తి, ముఖమంతా నొప్పితో కొంతకాలం బాధపడ్డాడు. బాగా పరిశీలిస్తే ఒక టమాటా విత్తు అతని ఆంగిట్లో ఇరికి అక్కడే మొలకెత్తిందని తెలిసింది. మొక్కలు నేరుగా అనారోగ్యానికి కారణాలవుతాయని మాత్రం చెప్పడానికి లేదు!

Saturday, November 13, 2010

My Daily Science Column

I have started contributing a daily science column in the fifth page of the famous Telugu daily Andhra Bhoomi.
It started appearing in the net version too.
I give here a sampler that appeared in the column yesterday.

The link to the page is given here.

http://www.andhrabhoomi.net/features/science

Visit the page daily for reading about a latest development in the field of science and technology!
In TELUGU that is!!

మొక్కల నుంచి ప్లాస్టిక్ .
- గోపాలం కె.బి.


November 11th, 2010

ప్లాస్టిక్‌లతో కాలుష్యం కలుగుతుందని ఒకవేపు అంటూనే మొక్కల నుంచి ప్లాస్టిక్ తయారుచేసే పద్ధతి గురించి పరిశోధకులు పాటుపడుతున్నారు. సిద్ధాంతం ప్రకారం, పెట్రోలియం ఉత్పత్తుల ఆధారంగా తయారయ్యే రసాయనాలన్నీ మొక్కల నుంచి పొందే వీలుంది. అంటే ఆ రసాయనాలు మొక్కలలో తయారయ్యేట్లు జెనెటిక్ ఇంజనీరింగ్ చేయవచ్చునని అర్థం! కానీ కావలసిన మోతాదులలో మొక్కల నుంచి ఆ రసయనాలను తీయడం ఇంతవరకు సాధ్యం కాలేదు. పారిశ్రామిక స్థాయిలో, కాలుష్యం లేకుండా రసాయనాలను తయారుచేసే పద్ధతికి ప్రారంభంగా యు.ఎస్. ఎనర్జీశాఖ వారు తమ బ్రూక్ హాలెన్ జాతీయ పరిశోధనశాలలో ప్లాస్టిక్ తయారీకి అవసరమయ్యే ఒక రసాయన సమ్మేళనాన్ని మొక్కల ద్వారా తయారు చేయగలిగారు.

పాలీ ఎతిలీన్ వంటి ప్లాస్టిక్‌లను తయారు చేయడానికి ప్రారంభ రసాయనంగా వాడడానికి వీలున్న ఒక రకం ఫ్యాటీ ఆసిడ్‌ను వీరు తయారు చేయగలిగారు. అది రసాయనశాలలో మాత్రం కాదు. మొక్కలలో రసాయనాల చర్యలను ఇంజనీరింగ్ చేసి, ఆ మొక్కలలోనే పెద్ద ఎత్తున రసాయనం పుట్టే పద్ధతిని వీరు సిద్ధం చేశారు.

‘‘ప్లాస్టిక్ తయారీకి ప్రారంభ రసాయనాలు ప్రస్తుతం పెట్రోలియం నుంచి వస్తున్నాయి. బొగ్గు ఆధారంగా తీసిన సింథటిక్ వాయువులను కూడా ఈ పనికి ఉపయోగిస్తున్నారు. కానీ ఈ పద్ధతిలో ఈ రసాయనాలు మొక్కలు, వాటి విత్తనాల నుంచి వస్తాయి. కనుక వాటికి తరిగిపోవడం, దొరకకపోవడం అన్న సమస్యలు ఉండవు’’ అంటారు పరిశోధకులు జాన్ షాంకిన్. మొక్కల నుంచి వచ్చిన ఫ్యాటీ ఆసిడ్‌లను ప్లాస్టిక్ తయారీ ప్రారంభ రసాయనాలుగా మార్చడానికి మరిన్ని పద్ధతులు, మరింత శ్రమ అవసరం. అది త్వరలోనే వీలవుతుందని అంటున్నారు.

మిల్క్ వీడ్ లాంటి మొక్కల విత్తనాలలో ఒమెగా సెవెన్ రకం ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. అయితే అవి చాలా తక్కువగా ఉంటాయి. గనుక పారిశ్రామిక సరళిలో ఉపయోగపడవు. ఈ రసాయనాలకు ఆధారమయిన జన్యువులను తీసి వేరురకం మొక్కలలో ప్రవేశపెట్టారు. అక్కడ ఉత్పత్తి మరింత తక్కువగా ఉన్నట్లు గమనించారు. రసాయనం కావలసిన స్థాయిలో తయారు కావాలంటే మొక్కల్లో మరేవో అంశాలను కూడా మార్చవలసి ఉంటుందని అర్థం చేసుకున్నారు.ఇందుకు సంబంధించిన ప్రయోగాలన్నీ ఆరాబిడోప్సిస్ అనే మొక్క మీద జరిగాయి. మిల్క్‌వీడ్ కన్నా ఈ మొక్కలో చాలా ఎక్కువగా రసాయనం తయారయ్యేలా పరిశోధనలు చేరుకున్నాయి. ప్లాంట్ ఫిజియాలజీ అన్న ‘ఆన్‌లైన్’ జర్నల్‌లో ఈ అంశాలను ప్రకటించారు. అచ్చులో వివరాల కోసం డిసెంబర్ దాకా ఆగవలసిందే!

If you enjoy reading science in Telugu, my efforts would be worthwhile!

!!!!!!!!

Friday, November 12, 2010

Shravanam - T N Seshagopalan

Shravanam with Malahari!

Sri T N Seshagopalan - RTP - Malahari



Let us enjoy great music!
@@@@

Thursday, November 11, 2010

K Siva Reddy's Poem

Sri K Siva Reddy as a poet has mellowed down.
Now he writes about the inability of doing certain things too!
One should read his poem about telling the truth under certain conditions!
That was quintessential Siva Reddy, the fighter.
Age has made him reflect on the life a lot and now he says the world would go on even if we are not there!

The poem that I am presenting here is the translation of one of his fine works!

Read on!!

What do poets do?

What do poets do?
Give voice to the walls
Eyes to the trees, tone to the winds

What do poets do?
Oppose the authority
Give hands to the populace
infinite power to the white paper


What do poest do
Pick up a hand ful of soil and curse
Even if the forehand is cut
With their half limbs, write poetry on the wall
In ochre colour for half a second
Poems that appear on the walls

Next moment
Will appear on the bodies of people
Bodies come rolling like oceans
Sand grains turn into stanzas and grow

Blame the home for the walls
Blame the man for the home
Blame the country for the men

Yes, what you want is
House without the walls, men without a house
Country without people

You are the coronated of the kingdom of desert
Rule your desert, desert you rule

 
what do poest do
Resist the law
Write poetry on the desert
Desert gradually
Turns into a live nation

What do poets do
Give voice to the walls
Eyes to the trees, tone to the winds
Hands to the populace

Hand them the poem of infinite power!


Let us enjoy good poetry!!
^^^^^^^

Wednesday, November 10, 2010

Three Truths!

This story is interesting.
I am sure it is available in it's varied forms in other cultures too!
It is about the ingenuity of the intelligent people!

మూడు సత్యాలు

సూఫీలు సత్యాన్ని వెదుకుతుంటారని పేరు. ఆ సత్యం యధార్థ వాదానికి సంబంధించినది. మూఢుడూ గర్వం గలవాడూ అయిన దుర్మార్గ ప్రభువొకడు ఆ సత్యాన్ని తాను స్వంతం చేసుకోవాలనుకున్నాడు. అతని పేరు రుదరిఘ్. (రోడరిగ్స్ కావచ్చు). అతను స్పెయిన్ లోని మార్సియాకు ప్రభువు. తరగోనా లోని సూఫీ గురువు ఉమర్ అల్ అలావీని బలవంత పెట్టి సత్యాన్ని చెప్పించవచ్చునని అతననుకున్నాడు.

ఉమర్ ను బంధించి రాజసభకు తెచ్చారు. "నీకు తెలిసిన సత్యాలను మాకు అర్థమయ్యే మాటలలో మాకు చెప్పాలని మా ఆనతి. లేదంటే నీ ప్రాణాలు ఉండవు!" అన్నాడు ప్రభువు.

"బందీ అయిన మనిషి ఒక సత్యాన్ని ఒక ప్రశ్నకు జవాబుగా చెపితే, ఆ సత్యం వలన అతను శిక్ష పడకుండా ఉండే పరిస్థితి వస్తే, అతడిని స్వతంత్రుడుగా వదలే విశ్వజనీనమయిన వీరాచారం నీ సభలో పాటిస్తావా?" అని అడిగాడు ఉమర్.

"సరే అలాగే పాటిద్దాం!" అన్నాడు రాజు.

"మీ ప్రభువు గౌరవానికి మీరే సాక్షులు అని ఇక్కడ ఉన్న వారందరినీ హెచ్చరిస్తున్నాను. నేనిప్పుడు మీకందరికీ ఒకటి కాదు మూడు సత్యాలు చెపుతాను" అన్నాడు ఉమర్.

"నీవు సత్యాలని చెపుతున్నవి నిజంగా సత్యాలని మాకూ నమ్మకం కలగాలి. చెప్పిన సత్యాలకు నిదర్శనాలు ఉండాలి" అన్నాడు రాజు.

"నీ వంటి ప్రభువుకు మేము ఒకటి కాక మూడు సత్యాలను చెపుతున్నప్పుడు, ఆ సత్యాలు తమకు తామే అర్థమయేవిగా ఉండేలాగ కూడా చెపుతాము" అన్నాడు ఉమర్.

రాజుకు "ఇదేదో బాగుంది" అనిపించింది.

"మొదటి సత్యం వినండి. తరగోనాకు చెందిన ఉమర్ అనే సూఫీ అని ఎవరినయితే అంటారో అతనినే నేను.

ఇక రెండవ సత్యం ఏమిటంటే నేను గనుక సత్యం చెపితే నన్ను విడిచి పెడతానని నీవు మాట ఇచ్చావు.

మూడవ సత్యం,  నీవేది సత్యం అనుకుంటున్నవో దాన్నే వినగోరుతున్నావు నీవు!" అన్నాడు ఉమర్.

ఈ మాటల ప్రభావం మరీ బలంగా ఉన్నట్లుంది. ఆ క్రూరుడు దర్విష్ ను వదిలి పెట్టక తప్ప లేదు.


The Three Truths


THE Sufis are known as Seekers of the Truth, this truth being a knowledge of objective reality. An ignorant and covetous tyrant once determined to possess himself of this truth. He was called Rudarigh, a great lord of Murcia in Spain. He decided that truth was something which Omar el-Alawi of Tarragona could be forced
to tell him.

Omar was arrested and brought to the Court. Rudarigh said: 'I have ordained that the truths which you know are to be told to me in words which I understand, otherwise your life is forfeit.'

Omar answered: 'Do you observe in this chivalric Court the universal custom whereby if an arrested person tells the truth in answer to a question and that truth does not inculpate him, he is released to freedom?'

'That is so,' said the lord.

'I call upon all of you here present to witness this, by the honour of our lord,' said Omar, 'and I will now tell you not one truth, but three.'

'We must also be satisfied,' said Rudarigh, 'that what you claim to be these truths are in fact truth. The proof must accompany the telling.'

'For such a lord as you,' said Omar, 'to whom we can give not one truth but three, we can also give truths which will be selfevident.'

Rudarigh preened himself at this compliment.

'The first truth', said the Sufi, 'is-"I am he who is called Omar the Sufi of Tarragona." The second is that you have agreed to release me if I tell the truth. The third is that you wish to know the truth as you conceive it.'

Such was the impression caused by these words that the tyrant was compelled to give the dervish his freedom.